నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందని ఇన్ సైడ్ టాక్. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా రూపొందబోయే ఈ ఫాంటసీ సోషల్ డ్రామాని పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కించబోతున్నట్టు వినికిడి. ఆన్ స్టాపబుల్ ప్రోమో షూటింగ్ సమయం నుంచే బాలయ్యతో ట్రావెల్ చేస్తున్న ప్రశాంత్ వర్మ అప్పటి నుంచే ఒక ఐడియా చెబుతూ వచ్చారట. ఫైనల్ గా ఒక వెర్షన్ ఇద్దరికీ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు.
అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ధృవీకరించలేం కానీ మొత్తానికి తెరవెనుక పనులు జరుగుతున్న మాట వాస్తవం. మోక్షజ్ఞకు ఫోటో షూట్ చేశారు. శాంపిల్ లుక్స్ ని సోషల్ మీడియాలో వదిలాక మంచి స్పందన వచ్చింది. ఊహించని విధంగా మేకోవర్ కావడం చూసి బాలయ్య ఫ్యాన్స్ సంతోషపడ్డారు. ఇంతకు ముందు ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే సత్యానంద్ తదితరుల వద్ద శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞని వీలైనంత వరకు వచ్చే ఏడాది థియేటర్లలో చూపించాలని బాలకృష్ణ కోరిక. అది నెరవేరడం ప్రశాంత్ వర్మ చేతుల్లో ఉంటుంది.
మొత్తానికి మంచి కాంబో సెట్ అయినట్టేనని చెప్పాలి. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, హరికృష్ణ, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత కొత్త జనరేషన్ నుంచి వస్తున్న హీరోగా మోక్షజ్ఞ మీద మాములు అంచనాలు ఉండబోవడం లేదు. ఇటీవలే వైవిఎస్ చౌదరి జానకిరామ్ అబ్బాయిని లాంఛ్ చేయబోతున్నానని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు కానీ అంతకన్నా ముందే మోక్షజ్ఞ తెరంగేట్రం చేయడం ఖాయం. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజులో తీస్తారట. ఇంకో నెలయ్యాక క్లారిటీ వస్తుంది.
హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ఆలస్యం అవుతున్న సినిమా. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి…
ప్రవస్థి అనే యువ సింగర్.. ఈటీవీలో వచ్చే లెజెండరీ మ్యూజిక్ ప్రోగ్రాం పాడుతా తీయగాలో తనకు జరిగిన అన్యాయంపై తీవ్ర…
పసిడి పరుగులు పెడుతోంది. క్షిపణి వేగాన్ని మించిన ధరలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మార్కెట్…
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ…
ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు…
నవ్యాంధ్ర రాజధానిలో పెట్టుబడులు.. పరిశ్రమలు.. మాత్రమేకాదు.. కలకాలం గుర్తుండిపోయేలా.. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా దీనిని తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు…