పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్ మహారాజా తెలుగులోనూ మంచి విజయం సొంతం చేసుకుంది. సోలో హీరోగా విజయ్ సేతుపతికి ఇక్కడ పెద్ద హిట్టు లేదన్న లోటుని తీర్చింది. ఇంత సక్సెస్ అయిన మూవీ మీద బాలీవుడ్ కళ్ళు పడకుండా ఉంటాయా. సీనియర్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. టైటిల్ రోల్ ఆయనే పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ప్రాధమికంగా డీల్ జరిగినట్టు తెలిసింది. సంతకాలయ్యాక అనౌన్స్ మెంట్ రావొచ్చు.
వాస్తవానికి విజయ్ సేతుపతి లాల్ సింగ్ చద్దాలో నటించాల్సింది. కానీ డేట్ల సమస్య రావడంతో ఇష్టం లేకపోయినా ఆ ప్రాజెక్టుని వదులుకున్నాడు. మక్కల్ సెల్వన్ నటనని పలు చిత్రాల్లో చూసిన అమీర్ కోరి మరీ తనకు పాత్ర ఆఫర్ చేసినా కాంబో కుదరలేదు. అదే నాగ చైతన్య తీసుకున్నాడు. ఫలితం డిజాస్టర్ కావడం చూసి విజయ్ సేతుపతి ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుని ఉంటారు కానీ చైతు మాత్రం ఉత్తరాదిలో బ్యాడ్ డెబ్యూ అందుకున్నాడు. సో మహారాజ చూసి అమీర్ ఖాన్ స్పెల్ బౌండ్ కావడంతో ఎలాంటి ఆశ్చర్యం లేదు. క్యాస్టింగ్, దర్శకుడు గట్రా ఇంకా లాక్ చేయాల్సి ఉంది.
తిరిగి సక్సెస్ ట్రాక్ మీద రావడం కోసం ఎదురు చూస్తున్న అమీర్ ఖాన్ కు మహారాజా బెస్ట్ ఛాయస్ అవుతుంది. నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్టయ్యే అంశాలు బోలెడు ఉన్నాయి. కాకపోతే నెట్ ఫ్లిక్స్ లో హిందీ అనువాదంతో సహా ఓటిటి వెర్షన్ అందుబాటులో ఉంది. ఇప్పటికే బోలెడు జనాలు చూసేసి ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మొదలుపెట్టడమో లేదా కీలక మార్పులు చేసుకోవడమో చేయాలి. లేదంటే అక్షయ్ కుమార్ సర్ఫిరా, సెల్ఫీ, బచ్చన్ పాండేలాగా చేదు ఫలితాన్ని చవి చూడాల్సి రావొచ్చు. నిదానమే ప్రధానం సూత్రం రీమేకుల విషయంలో అస్సలు పనికిరాదు.
This post was last modified on July 27, 2024 10:36 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…