మళ్లీ సినిమా థియేటర్లు మొదలవుతాయ్ కానీ ఇక మీదట ఓటిటి అనేది కూడా సినిమా బిజినెస్కి అత్యంత కీలకంగా మారుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. రీజనల్ మార్కెట్కి పరిమితమయ్యే సినిమాలకు ఒక విధమైన డిమాండ్ వుంటే, ఇతర భాషలకు కూడా అప్పీల్ అయ్యే సినిమాలకు ఓటిటిల నుంచి ఇంకా ఎక్కువ డిమాండ్ వుంటుంది. అంటే ఏ సినిమాల్లో అయితే అన్ని భాషల ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే స్టార్ కాస్ట్ వుంటుందో వాటికి ఎక్కువ రేటు పలుకుతుందన్నమాట. దీంతో పాన్ సౌత్ ఇండియా రీచ్ వున్న హీరోయిన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది.
ఉదాహరణకు సమంత, అనుష్క, రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి తదితర హీరోయిన్లకు సౌత్ ఇండియా అంతటా పాపులారిటీ వుంది. అనుష్క అయితే ఇండియా అంతటికీ సుపరిచితమే. సమంత కూడా ఇప్పుడు అదే పాన్ ఇండియా అప్పీల్ కోసం చూస్తోంది. ఒకే రాష్ట్రానికి, భాషకు పరిమితమైన హీరోయిన్ల కంటే బోర్డర్స్తో పని లేని హీరోయిన్లకు ఇకపై డిమాండ్ ఎక్కువన్నమాట.
గతంలో కంటే ఇకపై హీరోయిన్లు సూట్కేసులలో జీవించడానికి… అంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్లయిటెక్కి పక్క రాష్ట్రాలకు వెళ్లడానికి ఇష్టపడతారన్నమాట. ఈ ఓటిటి జమానాలో మల్టీ లాంగ్వేజెస్లో పాపులర్ అయిన హీరోయిన్ల పారితోషికం కూడా పెరిగే అవకాశాలు పుష్కలం. అంతెందుకు ఈ టైమ్లో కేవలం బాలీవుడ్కి పరిమితం అయిపోకుండా దక్షిణాదిలోను తమకు రీచ్ కావాలని అక్కడి నటులు కోరుకుంటున్నారంటే ఈ ట్రెండు మహిమ ఏమిటో తెలియడం లేదూ?
This post was last modified on September 25, 2020 3:53 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…