మళ్లీ సినిమా థియేటర్లు మొదలవుతాయ్ కానీ ఇక మీదట ఓటిటి అనేది కూడా సినిమా బిజినెస్కి అత్యంత కీలకంగా మారుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. రీజనల్ మార్కెట్కి పరిమితమయ్యే సినిమాలకు ఒక విధమైన డిమాండ్ వుంటే, ఇతర భాషలకు కూడా అప్పీల్ అయ్యే సినిమాలకు ఓటిటిల నుంచి ఇంకా ఎక్కువ డిమాండ్ వుంటుంది. అంటే ఏ సినిమాల్లో అయితే అన్ని భాషల ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసే స్టార్ కాస్ట్ వుంటుందో వాటికి ఎక్కువ రేటు పలుకుతుందన్నమాట. దీంతో పాన్ సౌత్ ఇండియా రీచ్ వున్న హీరోయిన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది.
ఉదాహరణకు సమంత, అనుష్క, రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి తదితర హీరోయిన్లకు సౌత్ ఇండియా అంతటా పాపులారిటీ వుంది. అనుష్క అయితే ఇండియా అంతటికీ సుపరిచితమే. సమంత కూడా ఇప్పుడు అదే పాన్ ఇండియా అప్పీల్ కోసం చూస్తోంది. ఒకే రాష్ట్రానికి, భాషకు పరిమితమైన హీరోయిన్ల కంటే బోర్డర్స్తో పని లేని హీరోయిన్లకు ఇకపై డిమాండ్ ఎక్కువన్నమాట.
గతంలో కంటే ఇకపై హీరోయిన్లు సూట్కేసులలో జీవించడానికి… అంటే ఎప్పుడంటే అప్పుడు ఫ్లయిటెక్కి పక్క రాష్ట్రాలకు వెళ్లడానికి ఇష్టపడతారన్నమాట. ఈ ఓటిటి జమానాలో మల్టీ లాంగ్వేజెస్లో పాపులర్ అయిన హీరోయిన్ల పారితోషికం కూడా పెరిగే అవకాశాలు పుష్కలం. అంతెందుకు ఈ టైమ్లో కేవలం బాలీవుడ్కి పరిమితం అయిపోకుండా దక్షిణాదిలోను తమకు రీచ్ కావాలని అక్కడి నటులు కోరుకుంటున్నారంటే ఈ ట్రెండు మహిమ ఏమిటో తెలియడం లేదూ?
This post was last modified on September 25, 2020 3:53 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…