మెగాస్టార్ చిరంజీవితో ఇప్పుడున్న అగ్ర దర్శకులెవరూ ఇంతకుముందు పని చేయలేదు. రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను వగైరా దర్శకులతో చిరంజీవి వర్క్ చేయలేదు. సురేందర్తో సైరా చేసినా కానీ అతడిని అగ్ర దర్శకుల కోటాలో వేయలేం. ఆ సినిమా వరకు చిరంజీవే కెప్టెన్. కొరటాల శివతో ఆచార్య చేయడంతోనే చిరంజీవికి ఇప్పటి అగ్ర దర్శకుల పని తీరు ఎలా వుంటుందనేది తెలిసి వచ్చింది. ఈ సినిమాకి వచ్చేసరికి చిరంజీవికి మాత్రమే నిర్ణయాధికారాలు లేవు.
కొరటాల శివ తన సినిమాలనెప్పుడూ తన కంట్రోల్లోనే పెట్టుకుంటాడు. నిర్మాత ఎవరయినా కానీ వ్యాపార లావాదేవీలు కూడా తనే చూసుకుంటాడు. ఆచార్యకు మొదట చరణ్ కూడా నిర్మాత అయినప్పటికీ తర్వాత పూర్తిగా కొరటాల మిత్రుడైన నిరంజన్ రెడ్డి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. తన సెట్లో తనే కెప్టెన్ అన్నట్టుండే చిరంజీవికి ఇక్కడ కొత్త అనుభవం ఎదురు కావడంతో తనకు కన్వీనియంట్గా వుండే దర్శకులతోనే పని చేయాలని డిసైడ్ అయ్యారట.
అందుకే లూసిఫర్ రీమేక్ వినాయక్ చేతికి వెళ్లగా, వేదళాం రీమేక్తో మెహర్ రమేష్కి మళ్లీ బ్రేక్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ వర్కింగ్ స్టయిల్ కంఫర్టబుల్గా వున్నట్టయితే బహుశా చిరంజీవి ఈ వయసులో కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఈతరం దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపించకపోవచ్చు.
This post was last modified on September 25, 2020 3:46 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…