మెగాస్టార్ చిరంజీవితో ఇప్పుడున్న అగ్ర దర్శకులెవరూ ఇంతకుముందు పని చేయలేదు. రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను వగైరా దర్శకులతో చిరంజీవి వర్క్ చేయలేదు. సురేందర్తో సైరా చేసినా కానీ అతడిని అగ్ర దర్శకుల కోటాలో వేయలేం. ఆ సినిమా వరకు చిరంజీవే కెప్టెన్. కొరటాల శివతో ఆచార్య చేయడంతోనే చిరంజీవికి ఇప్పటి అగ్ర దర్శకుల పని తీరు ఎలా వుంటుందనేది తెలిసి వచ్చింది. ఈ సినిమాకి వచ్చేసరికి చిరంజీవికి మాత్రమే నిర్ణయాధికారాలు లేవు.
కొరటాల శివ తన సినిమాలనెప్పుడూ తన కంట్రోల్లోనే పెట్టుకుంటాడు. నిర్మాత ఎవరయినా కానీ వ్యాపార లావాదేవీలు కూడా తనే చూసుకుంటాడు. ఆచార్యకు మొదట చరణ్ కూడా నిర్మాత అయినప్పటికీ తర్వాత పూర్తిగా కొరటాల మిత్రుడైన నిరంజన్ రెడ్డి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. తన సెట్లో తనే కెప్టెన్ అన్నట్టుండే చిరంజీవికి ఇక్కడ కొత్త అనుభవం ఎదురు కావడంతో తనకు కన్వీనియంట్గా వుండే దర్శకులతోనే పని చేయాలని డిసైడ్ అయ్యారట.
అందుకే లూసిఫర్ రీమేక్ వినాయక్ చేతికి వెళ్లగా, వేదళాం రీమేక్తో మెహర్ రమేష్కి మళ్లీ బ్రేక్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ వర్కింగ్ స్టయిల్ కంఫర్టబుల్గా వున్నట్టయితే బహుశా చిరంజీవి ఈ వయసులో కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఈతరం దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపించకపోవచ్చు.
This post was last modified on September 25, 2020 3:46 pm
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…