టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన కథానాయకుల్లో సమంత ఒకరు. ‘ఏమాయ చేసావె’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో తెలుగు తెరకు పరిచయం అయిన సామ్.. ఆ సినిమా అంత గొప్పగా ఆడకపోయినా తెలుగులో బిజీ హీరోయిన్లలో ఒకరైపోయింది. పదేళ్లకు పైగా స్టార్ హీరోల సరసన పెద్ద పెద్ద సినిమాలు చేసింది.
ఐతే పెళ్లి.. విడాకులు.. అనారోగ్యం.. ఇలా కొన్ని దశల తర్వాత ఆమె కెరీర్ జోరు తగ్గింది. వయసు పెరిగాక ఏ హీరోయిన్కైనా అవకాశాలు తగ్గడం మామూలే కానీ.. సమంతకు దాన్ని మించిన సమస్యలు ఎదురయ్యాయి. అనారోగ్యానికి చికిత్స కోసం గ్యాప్ తీసుకున్నాక ఆమె అవకాశాలు దాదాపు ఆగిపోయిన పరిస్థితి. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ పేరుతో స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా అనౌన్స్ చేసినా.. అది ఇంకా పట్టాలెక్కలేదు. దీంతో సమంత పునరాగమనం ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఐతే సినీ పునరాగమనం ఆలస్యం అయ్యేలా ఉంది కానీ.. ఈలోపు సామ్ వెబ్ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె బాలీవుడ్లో వరుణ్ ధావన్తో కలిసి నటించిన ‘సిటాడెల్’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ సిరీస్లతో ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రాజ్-డీకే దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. హాలీవుడ్లో ఇదే పేరుతో తెరకెక్కిన ఒరిజినల్కు ఇది ఇండియన్ వెర్షన్. షూట్ ఎప్పుడో పూర్తయినా.. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమై ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. ఐతే ఎట్టకేలకు డేట్ ఫిక్సయినట్లు కనిపిస్తోంది.
రాజ్-డీకే ట్విట్టర్లో ‘01.08’ అని ఉన్న పోస్టర్ ఒకటి షేర్ చేశారు. దానికి క్యాప్షన్గా తేనె డబ్బా, కుందేలు బొమ్మలున్న ఎమోజీలు జోడించారు. ఇవి ‘సిటాడెల్’ లీడ్ రోల్స్ అయిన హనీ, బన్నీలకు సంకేతాలు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆగస్టు 1న ‘సిటాడెల్’ రాబోతున్నట్లే అని సామ్ ఫ్యాన్స్ ఒక నిర్ణయానికి వచ్చేశారు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…