దగ్గుబాటి రానాతో అరణ్య తీసిన దర్శకుడు ప్రభు సాల్మన్ గుర్తున్నాడా. ఇతనిది చాలా విలక్షమైన శైలి. ప్రకృతి, అడవులు, జంతువులు లేకుండా ఏ సినిమా ఉండదు. మైనా (తెలుగు ప్రేమఖైది) తో సాల్మన్ పేరు మనకూ పరిచయమయ్యింది.
తర్వాత గజరాజులో ఏకంగా ఏనుగుని తీసుకొచ్చి ఫుల్ లెన్త్ మూవీ చేశాడు. అరణ్య ఆడలేదు కానీ నేచర్ మీద అతనికున్న ఆరాధనాభావం ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఇప్పుడు ఏకంగా మాంబో అంటూ నిజమైన సింహంతో సినిమా తీయడం సంచలనం రేపుతోంది. ఏషియాలో ఇలా రియల్ లయన్ తో తీసిన మొట్టమొదటి సినిమాగా మాంబో నిలవబోతోంది.
దీనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్నేహం కోసం, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా మనకు సుపరిచితుడైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ మనవడు విజయ్ శ్రీహరి దీంతో పరిచయం కాబోతున్నాడు. అంటే వనిత కొడుకన్న మాట.
ఇంకా చెప్పాలంటే నరేష్ ఆ మధ్య తీసిన మళ్ళీ పెళ్లిలో ఆయన భార్యగా నటించింది ఈవిడే. ఈ మాంబోలో ఒక మనిషికి క్రూర జంతువుకి మధ్య ఏర్పడే స్నేహం ఆధారంగా తీశారు. షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందట. ఇలా నిజ జంతవులను వాడేందుకు మన అటవీ చట్టాలు ఒప్పుకోవు కాబట్టి విదేశాల్లో షూట్ చేసినట్టు సమాచారం.
గతంలో తెలుగులోనూ మృగరాజు లాంటి ప్రయత్నాలు చేశారు కానీ అందులో అధిక శాతం గ్రాఫిక్ సింహాలే ఉంటాయి. కొన్ని సీన్లు మాత్రం సౌత్ ఆఫ్రికాలో నిజమైన సింహాలతో తీశారు. మాంబోని తమిళం, తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజయ్యింది.
కమర్షియల్ ఫార్ములాతో నాలుగు డబ్బులు వెనకేసుకుందామనే ట్రెండ్ లో ఉన్న డైరెక్టర్లకు భిన్నంగా ప్రభు సాల్మన్ ఇలా ప్రకృతిని ఇంతగా తెరమీద చూపించాలని తాపత్రయపడటం విచిత్రమే. ఇకపై కూడా ఈ బాటను విడవనని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు.
This post was last modified on July 26, 2024 2:31 am
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…