దగ్గుబాటి రానాతో అరణ్య తీసిన దర్శకుడు ప్రభు సాల్మన్ గుర్తున్నాడా. ఇతనిది చాలా విలక్షమైన శైలి. ప్రకృతి, అడవులు, జంతువులు లేకుండా ఏ సినిమా ఉండదు. మైనా (తెలుగు ప్రేమఖైది) తో సాల్మన్ పేరు మనకూ పరిచయమయ్యింది.
తర్వాత గజరాజులో ఏకంగా ఏనుగుని తీసుకొచ్చి ఫుల్ లెన్త్ మూవీ చేశాడు. అరణ్య ఆడలేదు కానీ నేచర్ మీద అతనికున్న ఆరాధనాభావం ప్రేక్షకులకు అర్థమయ్యింది. ఇప్పుడు ఏకంగా మాంబో అంటూ నిజమైన సింహంతో సినిమా తీయడం సంచలనం రేపుతోంది. ఏషియాలో ఇలా రియల్ లయన్ తో తీసిన మొట్టమొదటి సినిమాగా మాంబో నిలవబోతోంది.
దీనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్నేహం కోసం, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా మనకు సుపరిచితుడైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ మనవడు విజయ్ శ్రీహరి దీంతో పరిచయం కాబోతున్నాడు. అంటే వనిత కొడుకన్న మాట.
ఇంకా చెప్పాలంటే నరేష్ ఆ మధ్య తీసిన మళ్ళీ పెళ్లిలో ఆయన భార్యగా నటించింది ఈవిడే. ఈ మాంబోలో ఒక మనిషికి క్రూర జంతువుకి మధ్య ఏర్పడే స్నేహం ఆధారంగా తీశారు. షూటింగ్ దాదాపు పూర్తయిపోయిందట. ఇలా నిజ జంతవులను వాడేందుకు మన అటవీ చట్టాలు ఒప్పుకోవు కాబట్టి విదేశాల్లో షూట్ చేసినట్టు సమాచారం.
గతంలో తెలుగులోనూ మృగరాజు లాంటి ప్రయత్నాలు చేశారు కానీ అందులో అధిక శాతం గ్రాఫిక్ సింహాలే ఉంటాయి. కొన్ని సీన్లు మాత్రం సౌత్ ఆఫ్రికాలో నిజమైన సింహాలతో తీశారు. మాంబోని తమిళం, తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజయ్యింది.
కమర్షియల్ ఫార్ములాతో నాలుగు డబ్బులు వెనకేసుకుందామనే ట్రెండ్ లో ఉన్న డైరెక్టర్లకు భిన్నంగా ప్రభు సాల్మన్ ఇలా ప్రకృతిని ఇంతగా తెరమీద చూపించాలని తాపత్రయపడటం విచిత్రమే. ఇకపై కూడా ఈ బాటను విడవనని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు.
This post was last modified on July 26, 2024 2:31 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…