Movie News

శిరీష్ భుజాల మీదే బడ్డీ బరువు

ఊర్వశి రాక్షసివో తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ వచ్చే నెల ఆగస్ట్ 2న బడ్డీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కోలీవుడ్ సంస్థ స్టూడియో గ్రీన్ దీని మీద గట్టిగానే ఖర్చు పెట్టడమే కాక ప్రమోషన్లు కూడా ఎడతెరిపి లేకుండా చేస్తోంది. శిరీష్ అంతా తానై ఇంటర్వ్యూలు, ఈవెంట్లు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఒక రోజు ముందు ప్రీమియర్లే రిస్క్ అనుకుంటే ఏకంగా పది రోజుల ముందే విజయవాడ, వైజాగ్ లో స్పెషల్ షోలు వేయడం చూస్తే టీమ్ నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలను టార్గెట్ చేసిన అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి.

శిరీష్ కు ఇది హిట్ కావడం చాలా కీలకం. ఎందుకంటే కెరీర్ మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైనా సాలిడ్ గా ఒక బ్లాక్ బస్టర్ పడలేదు. శ్రీరస్తు శుభమస్తు బాగానే వర్కౌట్ అయినా అది కూడా వరసబెట్టి ఆఫర్లను తీసుకొచ్చింది కాదు. ఒకపక్క అన్నయ్య అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా పుష్పతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తను కూడా ఒకటి రెండు హిట్లు కొడితే కెరీర్ ని క్రమంగా సెటిల్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే సూర్య, కార్తీలాగా ఉండాలనేది తన కోరిక. కాకపోతే కంటెంట్ సరిగా పడక కుర్రాడి అవస్థలు కొనసాగుతున్నాయి. మరి బడ్డీ ఆ లోటుని తీరుస్తుందేమో చూడాలి.

ఇక సినిమా విషయానికి వస్తే బడ్డీ ఒక టెడ్డి బేర్ చుట్టూ జరిగే కథ. విలన్ అజ్మల్ చేసే విధ్వంసాన్ని శిరీష్ ఆ బొమ్మతో కలిసి ఎలా కట్టడి చేశాడనే పాయింట్ మీద రూపొందింది. సామ్ అంటోన్ దర్శకత్వం వహించగా హిప్ హాప్ తమిజా సంగీతం సమకూర్చాడు. పోటీ తీవ్రంగా ఏమి లేదు కాబట్టి టాక్ కనక పాజిటివ్ గా వస్తే ఆగస్ట్ 15 దాకా బాక్సాఫీస్ వద్ద మంచి ఛాన్స్ ఉంటుంది.దీనికైన బిజినెస్ కి రెండు వారాల గ్యాప్ సరిపోతుంది కనక బ్రేక్ ఈవెన్ దాటేసుకోవచ్చు. మరి ఇంతగా కష్టపడుతున్న శిరిష్ కి వచ్చే వారం రిలీజవుతున్న బడ్డీ ఎలాంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.

This post was last modified on July 25, 2024 11:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

37 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

60 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago