యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్.. అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్స్లో కూడా సందడి చేస్తుంటుంది. మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్ విన్నర్ మూవీలో తన పేరు మీదే రాసిన ఓ పాటలో ఆమె తళుక్కుమన్న సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని చిత్రాల్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది.
ఐతే గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రంలో తనకు ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినా తిరస్కరించారని ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెబితే ఆమెను బాగా ట్రోల్ చేశారు నెటిజన్లు. పవన్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే నో చెప్పావా.. ఇది నిజమేనా అంటూ కౌంటర్లు వేశారు. కానీ ఏ గుర్తింపూ రాని అలాంటి పాటల్లో నటించడం ఇష్టం లేకే నో చెప్పినట్లు అనసూయ చెప్పుకుంది.
కట్ చేస్తే అప్పుడు మిస్సయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ చేసే అవకాశాన్ని పట్టేసిందట అనసూయ. తాజాగా ఒక టీవీ షోలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. పవన్ కళ్యాణ్తో తాను అదిరిపోయే డ్యాన్స్ నంబర్ చేశానని.. శ్రీముఖి హోస్ట్ చేసే ఒక టీవీ షోలో అనసూయ వెల్లడించింది. దీంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా అరిచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అనసూయ పవన్ నటించే ఏ చిత్రంలో డ్యాన్స్ నంబర్ చేసిందన్నది ఆసక్తికరం.
పవన్ నటిస్తున్న మూడు చిత్రాలు మధ్యలో ఆగాయి. అవే.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ఉస్తాద్ షూట్ కొంచెమే జరిగింది. హరిహర వీరమల్లు లాంటి చారిత్రక చిత్రంలో డ్యాన్స్ నంబర్ ఉందా అన్నది డౌట్. బహుశా ఓజీలోనే ఈ డ్యాన్స్ నంబర్ ఉండొచ్చేమో.
This post was last modified on July 25, 2024 6:51 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…