ఒకప్పుడు బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయానికి దీటుగా కనిపించేవాడతను. ఒక సినిమాకు వాళ్ల స్థాయిలో పారితోషకం తీసుకోకున్నా.. వాళ్లు ఒక సినిమా చేసే టైంలో నాలుగైదు చిత్రాలు చేయడం ద్వారా వాళ్ల కన్నా ఎక్కువ సంపాదించేవాడు. పైగా తన సినిమాల్లో మంచి క్వాలిటీ ఉండేది. తరచుగా హిట్లు కొట్టేవాడు.
దీంతో ఖాన్ త్రయాన్ని మించిపోతాడనే చర్చ కూడా జరిగింది. అలాంటి హీరో కొన్నేళ్ల నుంచి సోలో హీరోగా ఓ మోస్తరు హిట్ కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. వరుసగా తన చిత్రాలు 16 ఫ్లాప్ కావడం గమనార్హం. ప్రతి హీరోకూ ఏదో ఒక దశలో రఫ్ ప్యాచ్ ఉంటుంది కానీ.. మరీ వరుసగా ఇన్ని ఫ్లాపులంటే తట్టుకోవడం కష్టం. కానీ అక్షయ్ మాత్రం ఆపకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే తన కొత్త చిత్రం ‘సర్ఫీరా’ కూడా డిజాస్టర్గా నిలిచింది.
ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా అక్షయ్ వరుస ఫ్లాపుల పట్ల ఒక రకమైన నిర్వేదంతో మాట్లాడాడు. ‘‘ప్రతి సినిమానూ ఇష్టంతోనే చేస్తాం. దాని కోసం ప్రాణం పెడతాం. కానీ ఆ సినిమాలు పరాజయం పాలైనపుడు చూసి గుండె ముక్కలవుతుంది. కానీ ప్రతి సినిమా నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒక సినిమా ఆడనపుడు ఇంకో సినిమాతో విజయం సాధించాలనే తపన మరింత పెరుగుతుంది. కెరీర్ ఆరంభంలోనే నేనీ విషయం తెలుసుకున్నా. సినిమా ఫ్లాప్ కావడం బాధించవచ్చు. కానీ ఆ బాధ ఆ సినిమా ఫలితాన్ని మార్చలేదు కదా. అది మన చేతుల్లో లేనిది. కష్టపడి పని చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈ ఆలోచనతోనే నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. మరో సినిమా కోసం పని చేయడం మొదలుపెడతా. కొవిడ్ తర్వాత సినిమా పరిశ్రమ చాలా మారింది. ప్రేక్షకులు కూడా మారారు. వైవిధ్యమైన సినిమాలు చూడ్డానికే ప్రాధాన్యమిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్టులు ఎంచుకోవడం ముఖ్యం’’ అని అక్షయ్ చెప్పాడు.
This post was last modified on July 24, 2024 5:05 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…