సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. తలైవర్ ని ఎప్పుడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో చూపిస్తానని లోకేష్ అన్న మాటలకు తగట్టుగా అభిమానులకు దీని మీద మాములు అంచనాలు లేవు. ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ రూపంలో బలమైన కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా ఇతని మీద తమిళ తంబీల ఆశలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా క్యాస్టింగ్ ని సెట్ చేసుకుంటున్న లోకేష్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్రను నాగార్జునని అడిగారట.
నిజానికి రెండు మూడు నెలల క్రితమే లోకేష్ నాగ్ ని వ్యక్తిగతంగా కలిసిన మాట నిజమే. ఫోటో కూడా బయటికి వచ్చింది. కానీ అది కూలి కథ చెప్పడానికని ఫ్యాన్స్ ఊహించలేదు. తీరా చూస్తే అదే నిజమయ్యేలా ఉంది. రజని, నాగ్ ఇద్దరూ ఒకే సినిమాలో నటించలేదు కానీ ఒకే కథతో వేర్వేరుగా రెండు భాషల్లో శాంతి క్రాంతి చేశారు. అది డిజాస్టర్ కావడం వేరే సంగతి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అభిమానులు కలగంటున్న కాంబినేషన్ ని లోకేష్ కనక నిజం చెయ్యగలిగితే అంతకన్నా కోరుకునేది ఏముంటుంది. అన్నపూర్ణ వర్గాలు మాత్రం నాగార్జున సానుకూలంగా ఉన్నారనే చెబుతున్నాయి.
అధికారిక ప్రకటన వచ్చే దాకా వెయిట్ చేయడం తప్ప ఇప్పటికిప్పుడు ఖరారుగా చెప్పలేం కానీ కూలిలో ఇలాంటి సర్ప్రైజ్ లు బోలెడు ప్లాన్ చేశాడట లోకేష్. బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ ని అడిగాడనే టాక్ ఉంది. ఇదీ కూడా ఓకే అయితే స్కేల్ ఓ రేంజ్ లో పెరుగుతుంది. సీనియర్ హీరోయిన్ శోభన ఇందులో నటించబోతున్నారు. దళపతిలో రజనితో ఆమె కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో చూశాం. కేవలం ప్రియురాలిగా కొంత భాగమే కనిపించినా అలా గుర్తుండిపోయారు. కూలిలో ఇలాంటి ఆకర్షణలు చాలానే ఉంటాయట. అనిరుధ్ రవిచందర్ సంగీతం మరో అట్రాక్షన్ గా నిలవనుంది.
This post was last modified on July 24, 2024 10:44 am
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…