సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. తలైవర్ ని ఎప్పుడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో చూపిస్తానని లోకేష్ అన్న మాటలకు తగట్టుగా అభిమానులకు దీని మీద మాములు అంచనాలు లేవు. ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న కమల్ హాసన్ కు విక్రమ్ రూపంలో బలమైన కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా ఇతని మీద తమిళ తంబీల ఆశలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా క్యాస్టింగ్ ని సెట్ చేసుకుంటున్న లోకేష్ ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్రను నాగార్జునని అడిగారట.
నిజానికి రెండు మూడు నెలల క్రితమే లోకేష్ నాగ్ ని వ్యక్తిగతంగా కలిసిన మాట నిజమే. ఫోటో కూడా బయటికి వచ్చింది. కానీ అది కూలి కథ చెప్పడానికని ఫ్యాన్స్ ఊహించలేదు. తీరా చూస్తే అదే నిజమయ్యేలా ఉంది. రజని, నాగ్ ఇద్దరూ ఒకే సినిమాలో నటించలేదు కానీ ఒకే కథతో వేర్వేరుగా రెండు భాషల్లో శాంతి క్రాంతి చేశారు. అది డిజాస్టర్ కావడం వేరే సంగతి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అభిమానులు కలగంటున్న కాంబినేషన్ ని లోకేష్ కనక నిజం చెయ్యగలిగితే అంతకన్నా కోరుకునేది ఏముంటుంది. అన్నపూర్ణ వర్గాలు మాత్రం నాగార్జున సానుకూలంగా ఉన్నారనే చెబుతున్నాయి.
అధికారిక ప్రకటన వచ్చే దాకా వెయిట్ చేయడం తప్ప ఇప్పటికిప్పుడు ఖరారుగా చెప్పలేం కానీ కూలిలో ఇలాంటి సర్ప్రైజ్ లు బోలెడు ప్లాన్ చేశాడట లోకేష్. బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ ని అడిగాడనే టాక్ ఉంది. ఇదీ కూడా ఓకే అయితే స్కేల్ ఓ రేంజ్ లో పెరుగుతుంది. సీనియర్ హీరోయిన్ శోభన ఇందులో నటించబోతున్నారు. దళపతిలో రజనితో ఆమె కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో చూశాం. కేవలం ప్రియురాలిగా కొంత భాగమే కనిపించినా అలా గుర్తుండిపోయారు. కూలిలో ఇలాంటి ఆకర్షణలు చాలానే ఉంటాయట. అనిరుధ్ రవిచందర్ సంగీతం మరో అట్రాక్షన్ గా నిలవనుంది.
This post was last modified on July 24, 2024 10:44 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…