మొన్నటిదాకా సోషల్ మీడియాని షేక్ చేసిన పుష్ప 2 వ్యవహారం మెల్లగా కొలిక్కి వస్తోంది. హఠాత్తుగా అల్లు అర్జున్ గెడ్డం తీసేయడంతో మొదలైన ఇష్యూ సుకుమార్ విదేశాలకు వెళ్లడం దాకా రకరకాల కథనాలను ప్రచారంలోకి తెచ్చింది. ఆయ్ ఈవెంట్లో బన్నీ వాస్ వీటికి వీలైనంత మేరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా నార్వేలో ఉన్న ఐకాన్ స్టార్ అవసరం లేని ఎపిసోడ్లను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయబోతున్నారు. ఫహద్ ఫాసిల్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటాడని తెలిసింది. పోలీస్ స్టేషన్ సీన్లతో పాటు అనసూయ, సునీల్ తదితరుల కాంబో ఉండొచ్చని వినికిడి.
డిసెంబర్ 6 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదనే లక్ష్యంతో ఉన్న పుష్ప టీమ్ నిజంగా దాన్ని నిలబెట్టుకుంటుందా లేదానే దాని గురించి ఇంకా ఊహాగానాలు ఆగలేదు. ఎందుకంటే స్పెషల్ సాంగ్ బ్యాలన్స్ ఉంది. ఏ హీరోయిన్ లాక్ అవ్వలేదు. జాన్వీ కపూర్ పేరు వినిపించినా ఆ దిశగా సూచనలు కనిపించడం లేదు. కీలకమైన క్లైమాక్స్ ని సుకుమార్ ఎన్ని రోజుల్లో ప్లాన్ చేసుకున్నారో తెలియదు. బన్నీ వచ్చాక షూట్ చేస్తారు కానీ డిసెంబర్ అయిదు నెలల దూరంలో ఉన్న నేపథ్యంలో ప్రతి రోజూ సవాల్ గానే మారనుంది. అయితే అంతా సాఫీగా జరిగిపోయేలా ప్లానింగ్ జరుగుతోందని టాక్.
గేమ్ చేంజర్ డిసెంబర్ మూడో వారంలో రావడం ఖరారు కావడంతో పుష్ప 2 అదే నెలలో ఇంకో డేట్ తీసుకోవడానికి లేకుండా పోయింది. పొరపాటున పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఇంకో మూడు నాలుగు నెలలు ఆగాల్సి వస్తుంది. ఇది తెలిసే మైత్రి మేకర్స్ వీలైనంత మేరకు టార్గెట్ చేరుకునేలా సర్వం సమకూరుస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2లో జగపతిబాబు లాంటి కొత్త ఆర్టిస్టులు చాలానే తోడయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. కల్కి 2898 ఏడి, దేవర తర్వాత ఆ స్థాయి బజ్ వచ్చేది పుష్ప 2 మీదేనని నార్త్ బయ్యర్లు సైతం నమ్మకంగా ఉన్నారు.
This post was last modified on July 23, 2024 4:10 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…