మాములుగా షో నడుస్తున్నప్పుడే వివాదాలకు నెలవుగా నిలిచే హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో మరోసారి తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. జియో సినిమా యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో నుంచి కొద్దిరోజుల క్రితం ఒక వీడియో చక్కర్లు కొట్టింది. అందులో అర్మాన్, కృతిక మాలిక్ పడక మీద చనువుగా ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. బూతు సైతం సిగ్గుపడేలా ఇలాంటివి ఎలా పొందుపరుస్తారని నెటిజెన్లు భగ్గుమన్నారు. పలు రాజకీయ నాయకులు అత్యవసరంగా షోని ఆపాల్సిందిగా కోర్టు కేసులు వేసేందుకు సిద్ధపడ్డారు. దీనికి నిర్మాతలు స్పందించారు.
అసలిది ఒరిజినల్ వీడియో కాదని, ఎవరో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో నైతికతను విస్మరించే ప్రసక్తే లేదని జియో సినిమా తరఫున ఒక ప్రకటన విడుదలయ్యింది. అసలు తమ షోలో అలాంటి వాటికి తావే లేదని పేర్కొన్నారు. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వ్యవహారం దూరం వెళ్లిపోయింది. సల్మాన్ ఖాన్ అంతటి పెద్ద స్టార్ టీవీలో బిగ్ బాస్ చేస్తున్నప్పుడే కొందరు ఓవర్ చేసి హద్దులు దాటిన వ్యవహారాలు చేశారు. అలాంటిది స్టార్ల పర్యవేక్షణ ఉండని ఓటిటి బిగ్ బాస్ లో ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. జియో మాత్రం డ్యామేజ్ రిపేర్ పనులు చేపట్టింది.
ఎంత ఎంటర్ టైన్ చేయడం కోసమే అయినా బిగ్ బాస్ నిర్వాహకులు ఇలా చేయడం ఏం బాలేదని వీరాభిమానులు సైతం అంటున్నారు. అయితే జియో ప్రతినిధులు మాత్రం కుట్రని దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే పట్టుకుంటామని పేర్కొంటున్నారు. ఇప్పటికైతే ఇష్యూ సద్దుమణిగింది కానీ మళ్ళీ ఎవరైనా బలమైన ఆధారాలు చూపిస్తే తప్ప స్పష్టత రాదు. తెలుగులో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. నాగార్జున యాంకర్ గా కొనసాగుతూ ఎనిమిదో సీజన్ ని అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. పైన చెప్పినంత తీవ్రంగా మన బిగ్ బాస్ లో అయితే ఎప్పుడూ జరగలేదు. జరగబోదు కూడా.
This post was last modified on July 23, 2024 3:26 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…