‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో చిన్నతనంలోనే దేశవ్యాప్తంగా ఆదరణ సంపాదించిన అమ్మాయి అవికా గోర్. ఆ తర్వాత ఆమె తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ మూవీతో కథానాయికగా మారింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఒక దశలో బాగా బొద్దుగా తయారై హీరోయిన్ పాత్రలకు సరిపోనట్లుగా కనిపించిన అవికా.. మధ్యలో బ్రేక్ తీసుకుని నాజూగ్గా తయారైంది. తర్వాత ఆమెకు మళ్లీ అవకాశాలు పెరిగాయి.
ఇప్పుడు పలు చిన్న చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అవికా.. ‘బ్లడీ ఇష్క్’ అనే కొత్త చిత్రంతో త్వరలోనే పలకరించబోతోంది. ఇది ప్రేమకథా చిత్రం కావడంతో తన వ్యక్తిగత జీవితంలో లవ్ గురించి కూడా మీడియా ముందు ఓపెనైంది అవికా. మిలంద్ చాంద్వానీ అనే తన స్నేహితుడితో అవికా కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఫియాన్సీ గురించి ఆమె మాట్లాడింది.
“కామన్ ఫ్రెండ్స్ ద్వారా నాకు మిలంద్ పరిచయం అయ్యాడు. దాదాపు ఆరు నెలల పాటు మేం స్నేహితులుగా ఉన్నాం. అతడే నాకు మొదట ప్రపోజ్ చేశాడు. ఇష్టాయిష్టాలు కలిశాయి. నా అభిప్రాయాలను అతను ఎంతో గౌరవిస్తాడు. అదే అతడి మీద ఇష్టం పెరిగేలా చేశాడు. అందుకే లవ్ ప్రపోజల్ చెప్పగానే ఓకే చెప్పా. మా మనసులు కలిశాయి. నా దృష్టిలో మానసికంగా మా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. పెళ్లి గురించి మేం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సమయం వచ్చినపుడు అది జరుగుతుంది. మా ఇద్దరి మధ్య వయసు అంతరం ఎక్కువ ఉంది. పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన పరిణామం కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని మిలంద్ చెప్పాడు. అందుకే దాని గురించి ఆలోచిస్తున్నా” అని అవికా వెల్లడించింది.
This post was last modified on July 22, 2024 10:52 pm
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…