సూర్య మొదటి ప్యాన్ ఇండియా మూవీ కంగువ అక్టోబర్ 10 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. తెలుగు వెర్షన్ డబ్బింగ్ హక్కులు ఇంకా అమ్మలేదని ట్రేడ్ టాక్. నిర్మాత జ్ఞానవేల్ రాజా ముప్పై కోట్లకు మించి రేట్ ఆశిస్తున్నారని, ట్రైలర్ లో విజువల్స్ చూశాక ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. కొందరు మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా చూపించిన కొన్ని విజువల్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయట. యాక్షన్ ఎపిసోడ్స్, భూత వర్తమాన కాలాలకు సంబంధించి ఎన్నో ఊహించని పాత్రలు పొందుపరిచారట.
కంగువతో రజనీకాంత్ వెట్టయాన్ క్లాష్ అయ్యే సూచనలు ఉండటంతో సూర్య టీమ్ ముందస్తుగా ప్రమోషన్లు వేగవంతం చేసే ప్లాన్ లో ఉంది. రిలీజ్ ఇంకా బోలెడు టైం ఉన్నప్పటికీ ఒక ప్రణాళిక ప్రకారం పబ్లిసిటీని సిద్ధం చేస్తోంది. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రోగ్రాంలు, అవుట్ డోర్ కార్యక్రమాలు ఇలా చాలానే సెట్ చేస్తున్నారు. ఫస్ట్ కాపీ సిద్ధం కావడం ఆలస్యం సూర్య ప్రత్యేకంగా నెల రోజుల దాకా కాల్ షీట్స్ కేటాయించబోతున్నట్టు తెలిసింది. యువి నిర్మాణ భాగస్వామ్యం ఉండటంతో తెలుగులోనూ భారీ సంఖ్యలో థియేటర్లు దక్కబోతున్నాయి. బయ్యర్లు ఫిక్స్ అయితే స్క్రీన్ల కేటాయింపు జరుగుతుంది.
ఫైనల్ గా కంగువకు తెలుగులో ఎంత బిజినెస్ ఆశిస్తున్నారో తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి. సూర్య ఇటీవలే నిర్మాతగా సర్ఫిరా రూపంలో డిజాస్టర్ చవిచూశాడు. అక్షయ్ కుమార్ తో ఆకాశం నీ హద్దురాని రీమేక్ చేయడం తగిన మూల్యం చెల్లించేలా చేసింది. సూర్య హీరో కాదు కాబట్టి ఇబ్బందేం లేదు కానీ కంగువ హిందీ మార్కెట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే తరచు సూర్య, జ్యోతికలు ముంబై మీడియాతో రెగ్యులర్ టచ్ లో ఉంటున్నారు. రోలెక్స్ తో సహా పలు షాక్ ఇచ్చే విషయాలు కంగువలో చాలా ఉంటాయట. శివ దర్శకత్వం, దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు,.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…