సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 పట్ల అభిమానులు ఎంత ఆత్రంగా ఉన్నారో చూస్తున్నాం. ఇప్పటికే ఫియర్ సాంగ్ ఊహించిన దానికన్నా పెద్ద ఛార్ట్ బస్టర్ అయ్యింది. అనిరుధ్ రవిచందర్ మిగిలిన పాటలనూ అంతకు మించిన స్థాయిలో ఇచ్చి ఉంటాడని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి రెండో లిరికల్ ఆడియో ప్రకటన ఈపాటికి వచ్చి ఉండాలి. కానీ ఇంకా పని పూర్తవ్వని కారణంగా అనౌన్స్ మెంట్ పెండింగ్ లో ఉంచారట. ఇందులో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ తన బాలీవుడ్ మూవీ ఉలజ్ ప్రమోషన్లలో భాగంగా దేవర ముచ్చట్లను పంచుకుంది.
బీచ్ ఒడ్డున ఆడిపాడుతూ రొమాన్స్ చేస్తూ తన పాత్ర సరదాగా ఉంటుందని అయితే మొదటి భాగం కంటే దేవర 2లోనే క్యారెక్టర్ ఎక్కువగా రివీలవుతుందని అసలు ట్విస్టు బయట పెట్టింది. అంటే ఫస్ట్ పార్ట్ లో పాటల్లో కనిపించినా, సన్నివేశాలు చేసినా పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్నది సీక్వెల్ లోనే అని అర్థమైపోతుంది. ఇంతకన్నా డీటెయిల్స్ చెప్పలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ సరసన డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తున్నానని మాత్రం హింట్ ఇచ్చింది. ఇంకో పాట షూటింగ్ బాలన్స్ ఉన్న దేవరలో జాన్వీ పాల్గొనాల్సి ఉంది. ఆహార కల్తీ వల్ల ఆసుపత్రిలో చేరి ఇటీవలే డిస్ఛార్జ్ అయ్యింది.
టాలీవుడ్ ఎంట్రీగా దేవర గురించి జాన్వీ కపూర్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. శ్రీదేవి వారసురాలిగా తెలుగులో ప్రవేశించడం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లతో జరగడంతో కెరీర్ పరంగా ఇక్కడ మంచి అవకాశాలు దక్కే సూచనలున్నాయి. ఇప్పటికే నాని శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ కోసం అడిగారనే టాక్ ఉంది కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర 1 విడుదలయ్యాక ఇంకో ఏడాది తర్వాత దేవర 2ని సిద్ధం చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు చరణ్, తారక్ షూటింగులతో బిజీ కానుంది.
This post was last modified on July 22, 2024 11:35 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…