సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 పట్ల అభిమానులు ఎంత ఆత్రంగా ఉన్నారో చూస్తున్నాం. ఇప్పటికే ఫియర్ సాంగ్ ఊహించిన దానికన్నా పెద్ద ఛార్ట్ బస్టర్ అయ్యింది. అనిరుధ్ రవిచందర్ మిగిలిన పాటలనూ అంతకు మించిన స్థాయిలో ఇచ్చి ఉంటాడని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. నిజానికి రెండో లిరికల్ ఆడియో ప్రకటన ఈపాటికి వచ్చి ఉండాలి. కానీ ఇంకా పని పూర్తవ్వని కారణంగా అనౌన్స్ మెంట్ పెండింగ్ లో ఉంచారట. ఇందులో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ తన బాలీవుడ్ మూవీ ఉలజ్ ప్రమోషన్లలో భాగంగా దేవర ముచ్చట్లను పంచుకుంది.
బీచ్ ఒడ్డున ఆడిపాడుతూ రొమాన్స్ చేస్తూ తన పాత్ర సరదాగా ఉంటుందని అయితే మొదటి భాగం కంటే దేవర 2లోనే క్యారెక్టర్ ఎక్కువగా రివీలవుతుందని అసలు ట్విస్టు బయట పెట్టింది. అంటే ఫస్ట్ పార్ట్ లో పాటల్లో కనిపించినా, సన్నివేశాలు చేసినా పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్నది సీక్వెల్ లోనే అని అర్థమైపోతుంది. ఇంతకన్నా డీటెయిల్స్ చెప్పలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ సరసన డాన్స్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తున్నానని మాత్రం హింట్ ఇచ్చింది. ఇంకో పాట షూటింగ్ బాలన్స్ ఉన్న దేవరలో జాన్వీ పాల్గొనాల్సి ఉంది. ఆహార కల్తీ వల్ల ఆసుపత్రిలో చేరి ఇటీవలే డిస్ఛార్జ్ అయ్యింది.
టాలీవుడ్ ఎంట్రీగా దేవర గురించి జాన్వీ కపూర్ ఎగ్జైట్ మెంట్ మాములుగా లేదు. శ్రీదేవి వారసురాలిగా తెలుగులో ప్రవేశించడం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లతో జరగడంతో కెరీర్ పరంగా ఇక్కడ మంచి అవకాశాలు దక్కే సూచనలున్నాయి. ఇప్పటికే నాని శ్రీకాంత్ ఓదెల కాంబో మూవీ కోసం అడిగారనే టాక్ ఉంది కానీ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర 1 విడుదలయ్యాక ఇంకో ఏడాది తర్వాత దేవర 2ని సిద్ధం చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒకేసారి ఆర్ఆర్ఆర్ హీరోలు చరణ్, తారక్ షూటింగులతో బిజీ కానుంది.
This post was last modified on July 22, 2024 11:35 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…