Movie News

పిక్ టాక్: కీర్తి సురేష్ మారిపోయింది


కెరీర్ అంతా గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్లు లీడ్ రోల్స్ ఆగిపోయాక సంప్రదాయ శైలిలో సాగే అక్క, వదిన పాత్రలకు మారిపోవడం చూస్తుంటాం. అలాగే కెరీర్లో ఒక దశ వరకు ట్రెడిషనల్ రోల్సే చేసే హీరోయిన్లు ఆ తర్వాత గ్లామర్ పాత్రల్లోకి మారడమూ చూడొచ్చు. కెరీర్లో దాదాపు పదేళ్ల పాటు సంప్రదాయ బద్ధంగానే కనిపించిన అనుపమ పరమేశ్వరన్.. ఇటీవల ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో ఎంత సెక్సీగా కనిపించిందో తెలిసిందే.

ఇదే బాటలో కీర్తి సురేష్ సైతం ఈ మధ్య బాగానే గ్లామర్ డోస్ పెంచుతోంది. ‘సర్కారు వారి పాట’ సహా కొన్ని చిత్రాల్లో ఆమె గ్లామర్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న సమయంలో ఆమె మరింత సెక్సీగా తయారవుతోంది. ‘తెరి’ రీమేక్‌ షూట్ సందర్భంగా ఆమె ఆన్ లొకేషన్ ఫొటోలు కొన్ని లీక్ కాగా.. అందులో తన క్లీవేజ్ షో చూసి అందరూ షాకయ్యారు.

ఐతే ఇప్పుడు కీర్తినే స్వయంగా జనాలకు గ్లామర్ డోస్ ఇస్తోంది. తమిళంలో తాను నటించిన ‘రఘు తాత’ అనే చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌కు కీర్తి తయారై వచ్చిన తీర చూసి అందరూ షాకైపోయారు. బ్యాక్ లెస్‌ జాకెట్ వేసుకుని ఆమె చేసిన స్కిన్ షోకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పాటు క్లీవేజ్ అందాల ఫొటోలు కూడా బాగా తిరుగుతున్నాయి.

బాలీవుడ్‌లో అడుగు పెట్టగానే కీర్తి అప్పీయరెన్సే మారిపోయిందని.. తాను నటిస్తున్న సినిమా శైలికి పూర్తి భిన్నంగా ప్రమోషన్లలో కనిపిస్తోందని చెన్నై సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కీర్తి పూర్తిగా మారిపోయిందని.. ‘తెరి’ రీమేక్ రిలీజయ్యాక కీర్తికి కొత్త ఇమేజ్ రావడం ఖాయమని.. మున్ముందు ఆమెను మరిన్ని గ్లామర్ పాత్రల్లో చూడొచ్చని అభిమానులు చర్చించుకుంటున్నారు.

This post was last modified on July 22, 2024 6:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago