టాలీవుడ్లో ఈ ఏడాది మాస్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయాయి. సంక్రాంతికి ‘హనుమాన్’, ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ లాంటి ఈవెంట్ మూవీస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కామెడీ ఎంటర్టైనర్ అయిన ‘టిల్లు స్క్వేర్’ కూడా బాగా ఆడింది. ఐతే ఎప్పట్లా మాస్ సినిమాల మోత మాత్రం లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ ఓ మోస్తరుగా హడావుడి చేసింది తప్ప.. మాస్ను ఊపేసే సినిమాలేవీ ఈ ఏడాది కనిపించలేదనే చెప్పాలి.
ఐతే కొంచెం గ్యాప్ తర్వాత టాలీవుడ్లో మాస్ జాతర మొదలు కాబోతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఎక్కువగా మాస్ సినిమాలదే హవా కాబోతోంది. ముందుగా ఇండిపెండెన్స్ డే వీకెండ్లో మాస్ను ఊపేసే సినిమాలే రాబోతున్నాయి. నిజానికి ఆ వీకెండ్లో ‘పుష్ప-2’ రావాల్సింది. అది మాస్ బాగా కనెక్ట్ అయ్యే చిత్రం. కానీ అది వాయిదా పడిపోయింది. అయినా ఇబ్బంది లేదన్నట్లు ఆ డేట్ను ఊర మాస్ సినిమాలే వాడుకోబోతున్నాయి.
ఆల్రెడీ రామ్-పూరి జగన్నాథ్ల ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15కు షెడ్యూల్ అయింది. అది మాస్ ఎంతగానో ఎదురు చూసే సినిమా అనడంలో సందేహం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ను ఒక ఊపు ఊపేసి బ్లాక్బస్టర్ అయింది. సీక్వెల్ మీద కూడా ఆ వర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఆగస్టు 15 రేసులోకి మరో పెద్ద సినిమా వచ్చింది. అదే.. మిస్టర్ బచ్చన్. రవితేజ అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అతడితో హరీష్ శంకర్ జట్టు కట్టడంతో మాస్లో భారీ అంచనాలుంటాయి. దీని ప్రోమోలు చూస్తే రవితేజ అభిమానులను అలరించే అంశాలకు ఢోకా ఉండదనిపిస్తోంది. ఈ ఏడాది అనుకున్నంతగా కళకళలాడని మాస్ సెంటర్లలో ఈ రెండు చిత్రాలతో సందడి నెలకొనడం ఖాయం.
ఆగస్టు 15కు ఆయ్, 35 లాంటి చిన్న చిత్రాలు కూడా షెడ్యూల్ అయ్యాయి కానీ.. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ పక్కాగా ఆ రోజు వచ్చేట్లయితే ఇవి వెనక్కి తగ్గబోతున్నట్లే. మరోవైపు ఆగస్టు 15కే రాబోతున్న తమిళ అనువాద చిత్రం ‘తంగలాన్’ సైతం మాస్ దృష్టిని బాగానే ఆకర్షించే అవకాశాలున్నాయి.
This post was last modified on July 21, 2024 6:56 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…