ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప-2’ గురించి ఈ మధ్య వరుసగా నెగెటివ్ వార్తలే వినిపిస్తున్నాయి. ఆగస్టు 15న రావాల్సిన ఈ చిత్రాన్ని డిసెంబరు 6కు వాయిదా వేయడం పెద్ద నెగెటివ్ న్యూస్. ఆ తర్వాత షూట్ సజావుగా సాగట్లేదని.. సుకుమార్-అల్లు అర్జున్ మధ్య గొడవలని.. డిసెంబరు 6న కూడా సినిమా రావడం కష్టమే అని.. ఇలా రకరకాల ప్రచారాలు సాగాయి.
ఐతే చిన్న విషయాలను పెద్దవి చేస్తున్నారని.. షూటింగ్ విషయంలో ఇబ్బందులేమీ లేవని.. చిన్న గ్యాప్ వచ్చిందని.. మళ్లీ షూట్ మొదలవుతుందని.. అనుకున్న ప్రకారమే సినిమాను పూర్తి చేసి డిసెంబరు 6న రిలీజ్ చేస్తామని చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అతి త్వరలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉంది. అందులో వెంటనే అల్లు అర్జున్ పాల్గొనడని.. వేరే ఆర్టిస్టుల మీద కీలక సన్నివేశాలు తీయాల్సి ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఐతే ఈ షెడ్యూల్లో విలన్ ఫాహద్ ఫాజిల్ మీదే కీ సీన్స్ తీయాల్సి ఉందట. కానీ ఆయన కాల్ షీట్స్ దొరకడం కష్టంగా ఉందట. ‘పుష్ప-2’కు ముందు అనుకున్న దాని కంటే డబుల్ కాల్ షీట్స్ ఇప్పటికే ఇచ్చాడట ఫాహద్. కానీ వాటిని సుకుమార్ అండ్ టీం సద్వినియోగం చేసుకోలేదు. తీసిన సీన్లే మళ్లీ తీసి.. కొన్ని సార్లు షూట్ క్యాన్సిల్ చేసి.. కొన్నిసార్లు ఒక రోజులో అనుకున్న సీన్ రెండు రోజులు తీసి.. ఇలా చాలా డేట్లు వృథా చేశారు. దీంతో ఫాహద్ విసుగెత్తిపోయినట్లు తెలుస్తోంది.
మలయాళంలో లీడ్ రోల్లో చేసే సినిమాలను నెల రోజుల్లో పూర్తి చేసేస్తుంటే.. ఇక్కడ ఈ నాన్చుడేంటి అంటూ ఆయన అసహనానికి గురైనట్లు సమాచారం. మల్టిపుల్ మూవీస్ చేస్తూ డేట్లు సర్దుబాటు చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటే.. మళ్లీ మళ్లీ ‘పుష్ప-2’ టీం షూట్ను పొడిగిస్తూ కొత్తగా కాల్ షీట్స్ అడుగుతుంటే ఆయన ఫ్రస్టేట్ అవుతున్నాడట. దీంతో ఫాహద్న ఒప్పించి కొత్త షెడ్యూల్ కోసం డేట్లు తీసుకోవడం ‘పుష్ప-2’ టీంకు ఛాలెంజింగ్గా మారిందని.. దీంతో పాటు అల్లు అర్జున్ కాంబినేషన్లో క్లైమాక్స్ కోసం కూడా ఫాహద్ డేట్లు తీసుకోవాల్సి రావడంతో పంచాయితీ తప్పేలా లేదని అంటున్నారు.
This post was last modified on July 21, 2024 6:45 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…