కొన్ని సంఘటనలు జరిగిన కాలంలో కన్నా ఎప్పుడో భవిష్యత్తులో ఊహించని టైంలో బయటపడి ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటిదే ఇది కూడా. గత కొద్దిరోజులుగా దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉన్నారు. ఆగస్ట్ 9 మురారి రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు అందుబాటులో ఉంటూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు తెలిసిన విశేషాలను పంచుకుంటున్నారు. ఏదైనా సందేహం వెలిబుచ్చితే వీలైనంత త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక మూవీ లవర్ అంతఃపురం సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు.
అందులో అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉండటం భలేగా అనిపించిందని, ఈ క్రియేటివ్ ఐడియా ఎలా వచ్చిందంటూ అడిగాడు. నిజానికి టీవీలో చూసిన చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న ఇదే. దానికాయన షాకయ్యే సమాధానం ఇచ్చారు. అసలది తాను డిజైన్ చేసింది కాదని, జెమిని ఛానల్ ప్రసారంలో దాని ఎడిటర్ అలా కలర్స్ మారుస్తూ పోయాడు తప్పించి ఒరిజినల్ వెర్షన్ కేవలం ఎరుపు రంగు మాత్రమే ఉంటుందని తేల్చేశారు. దీంతో థియేటర్ లో మిస్ అయిపోయి కేవలం టీవీలో చూసిన వాళ్ళు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
అంటే ఇన్నాళ్లు క్రియేటివ్ డైరెక్టర్ తెలివి అనుకుంటున్న సౌందర్య చీర రహస్యం వెనుక టీవీ ఎడిటర్ ఉన్నాడన్న మాట. ఒకవేళ ఆయన చెప్పకపోయి ఉంటే రంగులు మారిన అబద్దం శాశ్వతంగా ఉండిపోయేది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కృష్ణవంశీ రూపొందించిన అంతఃపురం అప్పట్లో కమర్షియల్ గానూ గొప్ప విజయం సాధించింది. భర్త చనిపోయాక అతని జ్ఞాపకాల్లో ఉన్న సౌందర్య ప్రేమ, విషాదాన్ని కలగలిసి పాడుకునే పాటగా అసలేం గుర్తుకురాదు వస్తుంది. సీతారామశాస్త్రి సాహిత్యంతో ఇళయరాజా కంపోజింగ్ దాన్నో మర్చిపోలేని క్లాసిక్ సాంగ్ గా నిలిచిపోయేలా చేసింది.
This post was last modified on July 21, 2024 12:58 pm
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని బీఆర్ఎస్…
సక్సెస్ లేని దర్శకుడితో సినిమా అంటే ఎన్నో లెక్కలుంటాయి. ఆడితే ఓకే కానీ తేడా కొడితే మాత్రం విమర్శల పాలు…
రెండు రోజుల్లలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన…
ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానులే కాదు సగటు సినీ ప్రియులు సైతం…
వలసవాద బ్రిటీష్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్థి చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రిమినల్ చట్టా లను మార్పు చేశారు.…
కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు మాసాలే అయింది. అయితే.. ఇంతలోనే అతి పెద్ద సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ…