కొన్ని సంఘటనలు జరిగిన కాలంలో కన్నా ఎప్పుడో భవిష్యత్తులో ఊహించని టైంలో బయటపడి ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటిదే ఇది కూడా. గత కొద్దిరోజులుగా దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉన్నారు. ఆగస్ట్ 9 మురారి రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు అందుబాటులో ఉంటూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు తెలిసిన విశేషాలను పంచుకుంటున్నారు. ఏదైనా సందేహం వెలిబుచ్చితే వీలైనంత త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక మూవీ లవర్ అంతఃపురం సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు.
అందులో అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉండటం భలేగా అనిపించిందని, ఈ క్రియేటివ్ ఐడియా ఎలా వచ్చిందంటూ అడిగాడు. నిజానికి టీవీలో చూసిన చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న ఇదే. దానికాయన షాకయ్యే సమాధానం ఇచ్చారు. అసలది తాను డిజైన్ చేసింది కాదని, జెమిని ఛానల్ ప్రసారంలో దాని ఎడిటర్ అలా కలర్స్ మారుస్తూ పోయాడు తప్పించి ఒరిజినల్ వెర్షన్ కేవలం ఎరుపు రంగు మాత్రమే ఉంటుందని తేల్చేశారు. దీంతో థియేటర్ లో మిస్ అయిపోయి కేవలం టీవీలో చూసిన వాళ్ళు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.
అంటే ఇన్నాళ్లు క్రియేటివ్ డైరెక్టర్ తెలివి అనుకుంటున్న సౌందర్య చీర రహస్యం వెనుక టీవీ ఎడిటర్ ఉన్నాడన్న మాట. ఒకవేళ ఆయన చెప్పకపోయి ఉంటే రంగులు మారిన అబద్దం శాశ్వతంగా ఉండిపోయేది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కృష్ణవంశీ రూపొందించిన అంతఃపురం అప్పట్లో కమర్షియల్ గానూ గొప్ప విజయం సాధించింది. భర్త చనిపోయాక అతని జ్ఞాపకాల్లో ఉన్న సౌందర్య ప్రేమ, విషాదాన్ని కలగలిసి పాడుకునే పాటగా అసలేం గుర్తుకురాదు వస్తుంది. సీతారామశాస్త్రి సాహిత్యంతో ఇళయరాజా కంపోజింగ్ దాన్నో మర్చిపోలేని క్లాసిక్ సాంగ్ గా నిలిచిపోయేలా చేసింది.
This post was last modified on July 21, 2024 12:58 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…