Movie News

సౌందర్య చీర రంగుతో ఎడిటర్ మోసం

కొన్ని సంఘటనలు జరిగిన కాలంలో కన్నా ఎప్పుడో భవిష్యత్తులో ఊహించని టైంలో బయటపడి ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటిదే ఇది కూడా. గత కొద్దిరోజులుగా దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉన్నారు. ఆగస్ట్ 9 మురారి రీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు అందుబాటులో ఉంటూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు తెలిసిన విశేషాలను పంచుకుంటున్నారు. ఏదైనా సందేహం వెలిబుచ్చితే వీలైనంత త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక మూవీ లవర్ అంతఃపురం సినిమా ప్రస్తావన తీసుకొచ్చాడు.

అందులో అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు పాటలో సౌందర్య చీర రంగులు మారుతూ ఉండటం భలేగా అనిపించిందని, ఈ క్రియేటివ్ ఐడియా ఎలా వచ్చిందంటూ అడిగాడు. నిజానికి టీవీలో చూసిన చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న ఇదే. దానికాయన షాకయ్యే సమాధానం ఇచ్చారు. అసలది తాను డిజైన్ చేసింది కాదని, జెమిని ఛానల్ ప్రసారంలో దాని ఎడిటర్ అలా కలర్స్ మారుస్తూ పోయాడు తప్పించి ఒరిజినల్ వెర్షన్ కేవలం ఎరుపు రంగు మాత్రమే ఉంటుందని తేల్చేశారు. దీంతో థియేటర్ లో మిస్ అయిపోయి కేవలం టీవీలో చూసిన వాళ్ళు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.

అంటే ఇన్నాళ్లు క్రియేటివ్ డైరెక్టర్ తెలివి అనుకుంటున్న సౌందర్య చీర రహస్యం వెనుక టీవీ ఎడిటర్ ఉన్నాడన్న మాట. ఒకవేళ ఆయన చెప్పకపోయి ఉంటే రంగులు మారిన అబద్దం శాశ్వతంగా ఉండిపోయేది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కృష్ణవంశీ రూపొందించిన అంతఃపురం అప్పట్లో కమర్షియల్ గానూ గొప్ప విజయం సాధించింది. భర్త చనిపోయాక అతని జ్ఞాపకాల్లో ఉన్న సౌందర్య ప్రేమ, విషాదాన్ని కలగలిసి పాడుకునే పాటగా అసలేం గుర్తుకురాదు వస్తుంది. సీతారామశాస్త్రి సాహిత్యంతో ఇళయరాజా కంపోజింగ్ దాన్నో మర్చిపోలేని క్లాసిక్ సాంగ్ గా నిలిచిపోయేలా చేసింది.

This post was last modified on July 21, 2024 12:58 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

17 minutes ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

20 minutes ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

20 minutes ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

4 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

6 hours ago