గత మూడు నాలుగు రోజులుగా పుష్ప 2 గురించిన వార్తలతో సోషల్ మీడియా ఎంతగా హోరెత్తిపోతోందో చూస్తున్నాం. అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్ చేశాడనే చిన్న వార్త పెద్ద ప్రకంపనం సృష్టించింది. ఒకేసారి తనతో పాటు దర్శకుడు సుకుమార్ వేర్వేరుగా విదేశాలకు వ్యక్తిగత ట్రిప్పుల మీద వెళ్లడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే న్యూస్ విపరీతంగా వైరలయ్యాయి. నేరుగా కలుసుకునే సందర్భం లేకపోవడంతో మీడియాకు క్లారిటీ తీసుకునే అవకాశం లేకపోయింది. ఇవాళ ఆయ్ పాట లాంచ్ సందర్భంగా బన్నీకి అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్ స్పష్టత ఇచ్చారు.
కేవలం పదిహేను రోజులకు సంబంధించిన పని మాత్రమే అల్లు అర్జున్ కు ఉందని, క్లైమాక్స్ తో పాటు మరొక్క పాట షూట్ చేస్తే అంతా అయిపోతుందని అన్నారు. పుకార్లను చూస్తూ నవ్వుకున్నామని, ఎవరికి వారు ఏవేవో అన్వయించుకుని రాశారని చెప్పారు. ఒకవేళ నిజంగా సుకుమార్ కనక ఇంకో ఆరు నెలలు పుష్ప 2 కోసం డిమాండ్ చేస్తే దాన్ని ఇచ్చి పుచ్చుకునే చనువు, స్నేహం వాళ్ళ మధ్య ఉన్నాయని, అలాంటప్పుడు ఇవన్నీ గాసిప్సని కొట్టిపారేశారు. సో పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ బయటికి రావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
అందరూ కోరుకునేది ఒకటే. డిసెంబర్ 6 పుష్ప 2 విడుదల కావాలి. ఎందుకంటే ఇప్పటికే వాయిదాల పర్వంలో నలిగిపోయి ఆగస్ట్ 15 లాంటి మంచి డేట్ వదులుకుని ఏడాది చివరికి వెళ్లాల్సి వచ్చింది. పుష్ప 1 అదే నెలలో వచ్చి బ్లాక్ బస్టర్ కావడంతో తేదీకి సంబంధించి టీమ్ లో ఎలాంటి టెన్షన్ లేదు. బిజీగా ఉన్న ఫహద్ ఫాసిల్ డేట్ల సమస్య కూడా ఆలస్యానికి కారణమని బన్నీ వాస్ చెప్పడం గమనార్హం. మొత్తానికి ఒక పెద్ద భారం దించినట్టే అయ్యింది. కాకపోతే వీలైనంత త్వరగా గుమ్మడికాయ కొట్టారనే శుభవార్త వినే వరకు ఇలాంటి ప్రచారాలకు చెక్ పెట్టడం కష్టం. ఇప్పటికైతే బ్రేక్ పడింది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…