గత మూడు నాలుగు రోజులుగా పుష్ప 2 గురించిన వార్తలతో సోషల్ మీడియా ఎంతగా హోరెత్తిపోతోందో చూస్తున్నాం. అల్లు అర్జున్ గెడ్డం ట్రిమ్ చేశాడనే చిన్న వార్త పెద్ద ప్రకంపనం సృష్టించింది. ఒకేసారి తనతో పాటు దర్శకుడు సుకుమార్ వేర్వేరుగా విదేశాలకు వ్యక్తిగత ట్రిప్పుల మీద వెళ్లడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే న్యూస్ విపరీతంగా వైరలయ్యాయి. నేరుగా కలుసుకునే సందర్భం లేకపోవడంతో మీడియాకు క్లారిటీ తీసుకునే అవకాశం లేకపోయింది. ఇవాళ ఆయ్ పాట లాంచ్ సందర్భంగా బన్నీకి అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్ స్పష్టత ఇచ్చారు.
కేవలం పదిహేను రోజులకు సంబంధించిన పని మాత్రమే అల్లు అర్జున్ కు ఉందని, క్లైమాక్స్ తో పాటు మరొక్క పాట షూట్ చేస్తే అంతా అయిపోతుందని అన్నారు. పుకార్లను చూస్తూ నవ్వుకున్నామని, ఎవరికి వారు ఏవేవో అన్వయించుకుని రాశారని చెప్పారు. ఒకవేళ నిజంగా సుకుమార్ కనక ఇంకో ఆరు నెలలు పుష్ప 2 కోసం డిమాండ్ చేస్తే దాన్ని ఇచ్చి పుచ్చుకునే చనువు, స్నేహం వాళ్ళ మధ్య ఉన్నాయని, అలాంటప్పుడు ఇవన్నీ గాసిప్సని కొట్టిపారేశారు. సో పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ బయటికి రావడంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
అందరూ కోరుకునేది ఒకటే. డిసెంబర్ 6 పుష్ప 2 విడుదల కావాలి. ఎందుకంటే ఇప్పటికే వాయిదాల పర్వంలో నలిగిపోయి ఆగస్ట్ 15 లాంటి మంచి డేట్ వదులుకుని ఏడాది చివరికి వెళ్లాల్సి వచ్చింది. పుష్ప 1 అదే నెలలో వచ్చి బ్లాక్ బస్టర్ కావడంతో తేదీకి సంబంధించి టీమ్ లో ఎలాంటి టెన్షన్ లేదు. బిజీగా ఉన్న ఫహద్ ఫాసిల్ డేట్ల సమస్య కూడా ఆలస్యానికి కారణమని బన్నీ వాస్ చెప్పడం గమనార్హం. మొత్తానికి ఒక పెద్ద భారం దించినట్టే అయ్యింది. కాకపోతే వీలైనంత త్వరగా గుమ్మడికాయ కొట్టారనే శుభవార్త వినే వరకు ఇలాంటి ప్రచారాలకు చెక్ పెట్టడం కష్టం. ఇప్పటికైతే బ్రేక్ పడింది.
This post was last modified on July 19, 2024 7:13 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…