హిట్టు ఫ్లాపు పక్కనపెడితే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న యూత్ హీరో రాజ్ తరుణ్ ఇటీవలే లావణ్య అనే అమ్మాయికి సంబంధించిన పోలీస్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విచారణ స్టేజిలో ఉంది. ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ కొత్త సినిమా పురుషోత్తముడు ఈ నెల 26 విడుదలకు సిద్ధమవుతోంది. మాములుగా హీరో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిర్మాతలు వాయిదా వైపు మొగ్గు చూపిస్తారు. కానీ ఈ ప్రొడ్యూసర్స్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. బహుశా తను లేకుండానే ప్రమోషన్లు చేస్తారేమో. ఇవాళ ట్రైలర్ ని తీసుకొచ్చారు.
కథ పూర్తిగా కాకపోయినా దాదాపు అర్థమయ్యేలా రెండున్నర నిమిషాల వీడియోని కట్ చేశారు. ధనవంతుడైన రచిత్ రామ్ (రాజ్ తరుణ్) యువతకు ఆదర్శంగా నిలిచేలా వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల ఒక పల్లెటూరికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఉన్న స్థానిక రాజకీయాలు, గూండాల దందాను తట్టుకుని రైతులకు, జనాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకుంటాడు. కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టాక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు రామ్ నిజంగా బిజినెస్ మ్యానా లేక ఇంకేదయినా నేపథ్యం ఉందా అనేది థియేటర్లలో చూశాకే అర్థమవుతుంది.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, కౌసల్య, బ్రహ్మాజీ, మురళీశర్మ, సమీర్ ఇలా పెద్ద క్యాస్టింగ్ తో పాటు పిజి విందా, గోపి సుందర్ లాంటి టాప్ టెక్నీషియన్స్ దీనికి పని చేయడం విశేషం. కంటెంట్ చూస్తుంటే మహేష్ బాబు శ్రీమంతుడు గుర్తుకు రావడంలో ఆశ్చర్యం లేదు. ఒకరకంగా చెప్పాలంటే రాజ్ తరుణ్ దానికి జూనియర్ లా కనిపిస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇంత స్కేల్ లో తను సినిమా చేయడం ఇదే మొదటిసారి. తిరగబడరా సామీ కూడా మాస్ సినిమానే కానీ ఈ పురుషోత్తముడులో క్లాస్ ని మిక్స్ చేశారు. చికాకులో ఉన్న రాజ్ తరుణ్ కు దీని ఫలితం స్వాంతన చేకూరుస్తుందేమో చూడాలి.
This post was last modified on July 19, 2024 6:07 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…