టాలీవుడ్లోకి సైలెంటుగా ఎంట్రీ ఇచ్చి ఉన్నట్లుండి రైజ్ అయిన యువ కథానాయకుల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. తన తొలి చిత్రం ‘రాజావారు రాణివారు’ థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో సక్సెస్ అయింది. రెండో చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ డివైడ్ టాక్తోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. దీంతో అవకాశాలు వరుస కట్టాయి. కానీ హడావుడిగా సినిమాలు ఒప్పేసుకుని చేసేయడం వల్ల చాలా వరకు తేడా కొట్టాయి.
సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ మినహా సినిమాలన్నీ డిజాస్టర్లయ్యాయి. చివరగా కిరణ్ నుంచి వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ దారుణమైన డిజాస్టర్లుగా మిగలడంతో ఇక కిరణ్ పని అయిపోయినట్లే అనుకున్నారంతా. కానీ అతను బౌన్స్ బ్యాక్ కావడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఆల్రెడీ రెండు సినిమాలు పూర్తి చేసి రిలీజ్కు రెడీ చేస్తున్న కిరణ్.. ఇంకో మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు సమాచారం.
ఇటీవలే కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘క’ అనే పాన్ ఇండియా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. కిరణ్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా క్యూరియస్గా కనిపించింది దీని టీజర్. సినిమాలో దమ్ముందనే సంకేతాలు టీజర్లో కనిపించాయి. ఈ సినిమా టీజర్ ఇండస్ట్రీ వర్గాలను కూడా బాగానే ఆకర్షించింది. ఆ టీజర్తోనే దాదాపుగా బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చిందట. ఫ్యాన్సీ ఆఫర్లతో థియేట్రికల్ రైట్స్ కొనడానికి బయ్యర్లు ముందుకొచ్చినట్లు సమాచారం. బిజినిస్ డీల్స్ దాదాపుగా క్లోజ్ చేసేసినట్లే చెబుతున్నారు. డిజిటల్ హక్కులకు కూడా డిమాండ్ ఏర్పడిందట.
ఐతే వేరే నిర్మాతలతో కలిసి సొంత ప్రొడక్షన్లోనే ఈ సినిమాను చేసిన కిరణ్.. కొన్ని ఏరియాల వరకు సొంతంగా రిలీజ్ చేయడం గురించి ఆలోచిస్తున్నాడట. దీంతోపాటుగా ‘దిల్ రుబా’ అనే లవ్ స్టోరీ చేశాడు కిరణ్. ఐతే ‘క’నే ప్రామిసింగ్గా కనిపిస్తుండడంతో దాన్నే ముందు రిలీజ్ చేసి.. ఆ తర్వాత ‘దిల్ రుబా’ను ప్రేక్షకుల ముందుకు తేవాలని అతను భావిస్తున్నాడట.
This post was last modified on July 19, 2024 9:48 am
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…