దేవరతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న జాన్వీ కపూర్ హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడం అభిమానులను టెన్షన్ పెట్టింది. ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జానీ ఆరోగ్యం తాలూకు అప్డేట్ ని తండ్రి బోనీ కపూర్ స్వయంగా వెల్లడించడంతో ఈ విషయం బయటికి వచ్చింది.
ఫుడ్ పాయిజనింగ్ (ఆహార కల్తీ) వల్లే ఈ ఇబ్బంది తలెత్తిందని ప్రస్తుతం కోలుకుంటోందని చెప్పడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. త్వరలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ మూవీ ఉల్లజ్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇలా జరగడంతో ప్రమోషన్లకు బ్రేక్ పడింది.
ఇక్కడ దేవర బృందం ఖంగారు పడటంలో తప్పేమీ లేదు కానీ ముప్పు తప్పింది కాబట్టి రిలాక్స్ అవ్వొచ్చు. ఆమె పాల్గొనాల్సిన కొంత టాకీ పార్ట్, పాటలు పెండింగ్ ఉన్నట్టు సమాచారం. దర్శకుడు కొరటాల శివ వాటికి సంబంధించిన షెడ్యూల్స్ ప్లాన్ చేసి ఉంచారు.
మరి హైదరాబాద్ కు వచ్చే పరిస్థితిలో జాన్వీ ఉందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే వాయిదాల పర్వంలో నలిగి సెప్టెంబర్ 27 ఫైనల్ డాట్ లాక్ చేసుకున్న దేవర టీమ్ ఉరుకుల పరుగుల మీద పనులు చేస్తోంది. డేట్ దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నా వర్క్స్ దృష్ట్యా రోజులు హారతిలాగా కరిగిపోతున్నాయి.
టెన్షన్ పడేందుకు అంతగా లేకపోయినా ఫుడ్డు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీగా జాన్వీకి ఎక్కడ ఆహారం తేడా కొట్టిందో తెలియాల్సి ఉంది. ఇటీవలే అంబానీ ఇంటి పెళ్లికి, ఉల్లజ్ ఈవెంట్లకు తప్ప బయటి ఎక్కడ తినలేదట. మరి తేడా ఎక్కడ జరిగిందో.
అయినా సామాన్యులు బయట ఫుడ్డు తిని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం సహజమే కానీ జాన్వీ లాంటి హీరోయిన్లు సైతం వీటి బారిన పడటం ఆశ్చర్యం కలిగించే విషయం. దేవర తర్వాత రామ్ చరణ్ 16లో ఆడిపాడనున్న శ్రీదేవి తనయ న్యాచురల్ స్టార్ నాని 33లో కూడా ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఉంది కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
This post was last modified on July 18, 2024 9:53 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…