మంచు విష్ణు కెరీర్లోనే కాకుండా మోహన్ బాబు ఫ్యామిలీ బ్యానర్లలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప డిసెంబర్ లో విడుదలవుతుందని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా హీరోనే స్వయంగా ప్రకటించడం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆ నెల ఆరున పుష్ప 2 ది రూల్ ఉంది. దీని గురించి రకరకాల వార్తలు మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ వాయిదా ఉంటుందేమోననే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. సరిగ్గా ఈ సమయంలో కన్నప్ప డిసెంబర్ లో వస్తున్నాడని చెప్పడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే తేదీని చెప్పకపోవడం గమనార్హం.
ఒకవేళ పుష్ప 2 ది రూల్ వచ్చినా కన్నప్పకి సలార్ తరహాలో డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని విష్ణు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. అదే టైంలో చైతు తండేల్, నితిన్ రాబిన్ హుడ్ ఉన్నాయి కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా అవి నిర్ణయాలు మార్చుకునే అవకాశాలు లేకపోలేదు. భారీ క్యాస్టింగ్ క్యామియోలతో రూపొందిన కన్నప్పలో మార్కెట్ పరంగా ప్రభాస్ పాత్ర చాలా కీలకం కానుంది. ముఖ్యంగా ఉత్తరాది బిజినెస్ అమాంతం పెంచేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిడివి ఎక్కువే ఉంటుందనే తరహాలో విష్ణు గతంలోనే చూచాయగా చెప్పాడు.
సో ఇంకా అయిదు నెలల ముందే డిసెంబర్ రేస్ రసవత్తరంగా మారుతోంది. బయటికి చెప్పలేదు కానీ బాలయ్య 109 కూడా అదే నెల వైపు చూస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అదే జరిగితే పోటీ మరింత టైట్ అవుతుంది. అయినా కర్చీఫ్ లు వేసుకోవడమే కానీ ప్యాన్ ఇండియా సినిమాలు ఖచ్చితంగా మాట మీద ఉంటాయన్న మాటమీద ఉండలేని తరుణంలో కన్నప్ప, పుష్ప 2, గేమ్ ఛేంజర్ ఇవన్నీ గ్యారెంటీ ఇవ్వలేని సిచువేషన్ లో ఉన్నాయి. డిసెంబర్ చెప్పేసారు కాబట్టి దానికి అనుగుణంగా కన్నప్ప ప్రమోషన్ల వేగం పెంచాల్సి ఉంటుంది. వరసగా ఈవెంట్లు, లాంచులు ఉండేలా మంచు బృందం ప్లానింగ్ లో ఉంది.
This post was last modified on July 18, 2024 1:23 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…