టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు అర్జున్ టాలీవుడ్లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. కానీ అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం కెరీర్ మొదలైన పదేళ్ల తర్వాత కూడా తడబడుతూనే ఉన్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో సినిమాలు ఓ మోస్తరుగా ఆడినా అతడి కెరీర్ మాత్రం అనుకున్నంతగా ఊపందుకోలేదు.
ఊర్వశివో రాక్షసివో తర్వాత శిరీష్ ఎంతో గ్యాప్ తీసుకుని బడ్డీ అనే సినిమా చేస్తే.. ఇది జనాల దృష్టిలోనే పడడం లేదు. మేకింగ్ దశలో టీం చాలా సైలెంటుగా ఉండిపోయింది. సినిమా ఫస్ట్ కాపీ తీశాక నేరుగా ట్రైలర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం జులై 26న బడ్డీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
ఐతే ట్రైలర్ లాంచ్ చేసి, రిలీజ్ డేట్ ప్రకటించాక కూడా ఈ సినిమా గురించి ఎక్కడా చర్చే లేకపోయింది. రిలీజ్ డేట్ దగ్గర పడ్డా సోషల్ మీడియాలో సౌండ్ లేదు. ఈ చిత్రానికి బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని.. పైగా కల్కి లాంటి పెద్ద సినిమా తర్వాత టాలీవుడ్లో వాతావరణం కొంచెం స్తబ్దుగా మారిపోవడంతో వేరే సినిమాల వైపు ప్రేక్షకులు చూడట్లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ వారం రిలీజవుతున్న డార్లింగ్ గురించి కూడా పెద్దగా ప్రేక్షకుల్లో డిస్కషన్ లేదు. ఈ నేపథ్యంలోనే బడ్డీ మూవీని వారం వాయిదా వేసి ఆగస్టు 2న రిలీజ్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. కొత్త డేట్తో పోస్టర్ కూడా బయటికి వచ్చింది. అప్పటికైనా సినిమాకు ఆశించిన హైప్ వస్తుందా.. రిలీజ్ ముంగిట ప్రమోషన్ల హడావుడి పెంచి సినిమా పేరు జనాల్లో నానేలా చేస్తారా.. చూడాలి మరి.
This post was last modified on July 17, 2024 10:24 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…