పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపున్న తెలుగు నటుల్లో రానా దగ్గుబాటి ఒకడు. ‘బాహుబలి’ కంటే ముందే అతను రెండు బాలీవుడ్ చిత్రాలతో హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించాడు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. తర్వాత తన ప్రతి సినిమా పట్ల పర భాషా నటులు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఒక టైంలో బహు భాషల్లో విరామం లేకుండా సినిమాలు చేశాడు రానా. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ కూడా చేశాడు. కానీ ఈ మధ్య అతడి కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది. గత ఏడాది కాలంలో తన నుంచి కొత్త రిలీజే కాలేదు. ఓటీటీలో వచ్చిన ‘రానా నాయుడు’ సిరీస్ను పక్కన పెడితే.. గత రెండేళ్లలో సినిమా రిలీజ్లే లేవు. చివరగా రెండేళ్ల కిందట ‘విరాటపర్వం’ చిత్రంతో పలకరించాడతను. బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడిగా కనిపించిన రానా.. ఇంత గ్యాప్ తీసుకున్నాడేంటి అని తన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా ఒక సినీ వేడుకలో రానా తన కెరీర్లో గ్యాప్ రావడంపై స్పందించాడు. “నా జీవితమంతా కొత్త కొత్త ప్రయత్నాలే చేస్తూ వచ్చాయి. కానీ ఆ సినిమాలు ఇప్పుడు మామూలు అయిపోయాయి. వాటిని మించి కొత్తగా ఏదైనా చేయాలని కథలు వెతుకుతున్నా. ఈ వెతుకులాటలోనే రెండేళ్లు గడిచిపోయాయి. త్వరలోనే కొత్త సినిమాల కబుర్లు పంచుకుంటా. ఏ సినిమా చేసినా ఎగ్జైటింగ్గా ఉండాలన్నది నా ఉద్దేశం” అని రానా చెప్పాడు.
‘లీడర్-2’ చేస్తారా అని రానాను అడిగితే.. ఆ ప్రశ్న శేఖర్ కమ్ములను అడగాలని నవ్వేశాడు. రానా ప్రస్తుతం ‘రానా నాయుడు-2’లో నటిస్తున్నాడు. దీని ఫస్ట్ సీజన్ ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వెంకీ లాంటి ఫ్యామిలీ హీరోను పెట్టి అడల్ట్ డోస్ గట్టిగా ఇవ్వడాన్ని చాలామంది వ్యతిరేకించారు. మరి సెకండ్ సీజన్లో కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on July 17, 2024 4:00 pm
దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధిపతి విజయ్ రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారారు. ఆయనను కార్నర్ చేస్తూ.. బీజేపీసహా ఇతర పార్టీలు…
ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…