పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపున్న తెలుగు నటుల్లో రానా దగ్గుబాటి ఒకడు. ‘బాహుబలి’ కంటే ముందే అతను రెండు బాలీవుడ్ చిత్రాలతో హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించాడు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగింది. తర్వాత తన ప్రతి సినిమా పట్ల పర భాషా నటులు కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
ఒక టైంలో బహు భాషల్లో విరామం లేకుండా సినిమాలు చేశాడు రానా. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ కూడా చేశాడు. కానీ ఈ మధ్య అతడి కెరీర్లో బాగా గ్యాప్ వచ్చేసింది. గత ఏడాది కాలంలో తన నుంచి కొత్త రిలీజే కాలేదు. ఓటీటీలో వచ్చిన ‘రానా నాయుడు’ సిరీస్ను పక్కన పెడితే.. గత రెండేళ్లలో సినిమా రిలీజ్లే లేవు. చివరగా రెండేళ్ల కిందట ‘విరాటపర్వం’ చిత్రంతో పలకరించాడతను. బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడిగా కనిపించిన రానా.. ఇంత గ్యాప్ తీసుకున్నాడేంటి అని తన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా ఒక సినీ వేడుకలో రానా తన కెరీర్లో గ్యాప్ రావడంపై స్పందించాడు. “నా జీవితమంతా కొత్త కొత్త ప్రయత్నాలే చేస్తూ వచ్చాయి. కానీ ఆ సినిమాలు ఇప్పుడు మామూలు అయిపోయాయి. వాటిని మించి కొత్తగా ఏదైనా చేయాలని కథలు వెతుకుతున్నా. ఈ వెతుకులాటలోనే రెండేళ్లు గడిచిపోయాయి. త్వరలోనే కొత్త సినిమాల కబుర్లు పంచుకుంటా. ఏ సినిమా చేసినా ఎగ్జైటింగ్గా ఉండాలన్నది నా ఉద్దేశం” అని రానా చెప్పాడు.
‘లీడర్-2’ చేస్తారా అని రానాను అడిగితే.. ఆ ప్రశ్న శేఖర్ కమ్ములను అడగాలని నవ్వేశాడు. రానా ప్రస్తుతం ‘రానా నాయుడు-2’లో నటిస్తున్నాడు. దీని ఫస్ట్ సీజన్ ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. వెంకీ లాంటి ఫ్యామిలీ హీరోను పెట్టి అడల్ట్ డోస్ గట్టిగా ఇవ్వడాన్ని చాలామంది వ్యతిరేకించారు. మరి సెకండ్ సీజన్లో కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on July 17, 2024 4:00 pm
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…
ముందు ప్రకటించిన ప్రకారమైతే అడివి శేష్ డెకాయిట్ మార్చి 19 విడుదల కావాలి. కానీ అదే రోజు దురంధర్ 2,…
టీ20 ప్రపంచకప్లో మొన్నటిదాకా భారత జట్టు టైటిల్కు హాట్ ఫేవరెట్. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ గెలిచింది. మొత్తం…
సినిమాల పట్ల ఆసక్తి లేని పిల్లలు తక్కువగా ఉంటారు. అందులోనూ సినీ కుటుంబానికి చెందిన వాళ్లయితే కచ్చితంగా అటు వైపు…
వైసీపీ హయాంలో అప్పటి ఆ పార్టీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజును అక్రమంగా అరెస్టు చేసి..…