సరిగ్గా ఇంకో నెలలో విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ చేతిలో ఉన్న టైంకు తగ్గట్టు ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. వాయిదా పడితే ఆ డేట్ ని తీసుకుందామని ఎదురు చూస్తున్న రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలు తప్పుకునే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ హీరో రామ్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ రీమేక్ కావడంతో అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ది వారియర్, స్కంద ఫలితాలు తీవ్రంగా నిరాశ పరిచాక తన మార్కెట్ తిరిగి బలంగా నిలబెట్టేది డబుల్ ఇస్మార్టేననే నమ్మకంతో రామ్ ఉన్నాడు. లైగర్ తర్వాత పూరిది ఇదే పరిస్థితి.
ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సుమారు 60 కోట్లకు డీల్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. ఇందులో 6 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ గా ఉంటుంది. అంటే రికవరీ కావాలంటే ఖచ్చితంగా గ్రాస్ వంద కోట్లు దాటేయాలి. సంక్రాంతి విజేత హనుమాన్ నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వినికిడి. మొత్తం రికవరీ అయ్యాక ఇరవై శాతం కమీషన్ తీసుకునేలా మాట్లాడుకున్నారట. ఇది అధికారిక సమాచారం కాకపోయినా ట్రేడ్ వర్గాల్లో బలంగా తిరుగుతోంది. ఫ్లాప్ హీరో డైరెక్టర్ కాంబోకి ఇంత మొత్తమంటే ఇది ఇస్మార్ట్ శంకర్ ప్రభావమే.
ఇంకొంచెం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ అవతారం ఎత్తాడు. మొదటి భాగానికి మించిన కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని ఆల్రెడీ వదిలిన రెండు పాటల కంటెంట్ తో అర్థమైపోయింది. ట్రైలర్ లాంచ్ త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. ఆగస్ట్ 15న విక్రమ్ తంగలాన్ తో ప్యాన్ ఇండియా పోటీ పడే సూచనలు ఉండటంతో దానికి తగ్గట్టే పూరి బృందం పబ్లిసిటీని డిజైన్ చేస్తోంది. సరైన మాస్ బొమ్మ వచ్చి నెలలు గడిచిపోతున్న తరుణంలో పాజిటివ్ టాక్ వస్తే కనక డబుల్ ఇస్మార్ట్ రచ్చ మాములుగా ఉండదు.
This post was last modified on July 16, 2024 12:16 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…