హైదరాబాద్, బెంగళూరు…ఇలా డ్రగ్స్ పట్టుబడిన చోట ఎంతో కొంత లింక్ సినీ పరిశ్రమకు ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా హైదరాబాద్ లో మరో డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన లింక్ దొరకడం సంచలనం రేపుతోంది. తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, హీరో అమన్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది.
అమన్ ప్రీత్ సింగ్ దగ్గర నుంచి సుమారు 200 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. రాజేంద్రనగర్ డివిజన్ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. వారు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అయిదుగురు విఐపిలలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరిని తెలుస్తోంది. ఇటీవల అమన్ ప్రీత్ సింగ్ తెరంగేట్రం చేసి ఓ సినిమాలో హీరోగా కూడా నటించాడు.
అయితే, ప్రస్తుతానికి ఈ స్టింగ్ ఆపరేషన్ పూర్తి కాకపోవడంతో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. 200 గ్రాముల కొకైన్ ధర మార్కెట్లో కొన్ని కోట్లు ఉంటుందని అంచనా. మరి, ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన మిగతా నలుగురు వీఐపీలు ఎవరు? వారికి సినీ పరిశ్రమతో ఏమైనా లింకులు ఉన్నాయా? అన్న సంగతి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రం ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.
This post was last modified on July 15, 2024 6:21 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…