తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంత ప్రేమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘జెంటిల్మన్’ మొదలుకుని ‘2.0’ వరకు ఆయన సినిమాలు తమిళంలో ఎంత విజయం సాధించాయో తెలుగులో కూడా అంతే సక్సెస్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకుల నుంచి అత్యంత ఆదరణ పొందిన తమిళ దర్శకుడు ఆయనే అంటే ఆశ్చర్యమేమీ లేదు. అలాంటి దర్శకుడి నుంచి ‘భారతీయుడు-2’ లాంటి సినిమా రావడం ప్రేక్షకులకు అస్సలు రుచించడం లేదు. ఏ శంకర్ సినిమాకూ రానంత వ్యతిరేకతను ఈ చిత్రం మూటగట్టుకుంది.
పేరుకు ఇది తమిళ సినిమానే కానీ.. అక్కడికంటే తెలుగులోనే దీనికి జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఓపెనింగ్స్ కూడా తమిళం కంటే ఎక్కువ వచ్చాయన్నది ట్రేడ్ పండిట్ల అంచనా. దీన్ని బట్టి శంకర్ మీద మన వాళ్లకు ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంత నమ్మిన దర్శకుడు తన స్థాయికి ఏమాత్రం తగని సినిమా తీయడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు.
ఐతే ‘భారతీయుడు-2’ సినిమాను విమర్శకులతో పాటు ప్రేక్షకులు విమర్శిస్తున్నారన్నా.. ట్రోల్ చేస్తున్నారన్నా అది శంకర్ మీద ఉన్న కోపం అనుకోవడానికి లేదు. దాన్ని కోపం కంటే బాధగా భావించాలి. ఎలాంటి దర్శకుడు ఎలా అయిపోయాడు అనే బాధ నుంచే విమర్శలు పుట్టుకొస్తున్నాయి.
శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్మన్’కే మనవాళ్లు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా ప్రతి సినిమానూ మన వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు. ‘బాయ్స్’ లాంటి శంకర్ స్థాయికి తగని సినిమాను కూడా తమిళుల కంటే తెలుగు వాళ్లు బాగా ఆదరించారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘2.0’కు కూడా భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. తమను ఆయా సినిమాలతో శంకర్ ఎంతగా అలరించాడో తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. అత్యున్నత స్థాయి సినిమాలతో ప్రేక్షకుల స్థాయిని కూడా పెంచిన దర్శకుడు శంకర్. అలాంటి మేటి దర్శకుడు ‘భారతీయుడు-2’ లాంటి కంటెంట్ లేని సినిమా ఇచ్చేసరికి ప్రేక్షకులు జీర్ణించుకోలేక తమ అభిమాన దర్శకుడు ఇలా ప్రమాణాలు తగ్గించుకోవడం మీద బాధతో స్పందిస్తున్నారు.
This post was last modified on July 15, 2024 6:10 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…