చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ అంటే ఫాన్స్ ఉర్రూతలూగిపోయేవారు. మొన్నామధ్య సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలయ్యాయి. రెండూ హిట్టయినా కానీ పైచేయి మాత్రం చిరంజీవి సాధించారు. కాకపోతే రెండూ మాస్ సినిమాలయితే ఆ క్లాష్ మరింత రసవత్తరంగా వుండేది. అలాంటి రసవత్తర పోటీ జరిగే అవకాశం వుందని ఇప్పుడు వినిపిస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ చిత్రాన్ని ఏప్రిల్ 30కి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అది సింహా రిలీజ్ డేట్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం కలిసి వస్తుందని ఆ డేట్ అనుకుంటున్నారు కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా తెలీదు.
రెండు చిత్రాలు నవంబర్లోనే మళ్లీ సెట్స్కి వెళ్లవచ్చు. దర్శకులు అనుకుంటున్నట్టుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండూ పూర్తయితే మరోసారి ఈ వెటరన్ సూపర్స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వద్ద అమీ తుమీ చూడవచ్చు.
This post was last modified on September 23, 2020 7:28 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…