చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ అంటే ఫాన్స్ ఉర్రూతలూగిపోయేవారు. మొన్నామధ్య సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలయ్యాయి. రెండూ హిట్టయినా కానీ పైచేయి మాత్రం చిరంజీవి సాధించారు. కాకపోతే రెండూ మాస్ సినిమాలయితే ఆ క్లాష్ మరింత రసవత్తరంగా వుండేది. అలాంటి రసవత్తర పోటీ జరిగే అవకాశం వుందని ఇప్పుడు వినిపిస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ చిత్రాన్ని ఏప్రిల్ 30కి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అది సింహా రిలీజ్ డేట్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం కలిసి వస్తుందని ఆ డేట్ అనుకుంటున్నారు కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా తెలీదు.
రెండు చిత్రాలు నవంబర్లోనే మళ్లీ సెట్స్కి వెళ్లవచ్చు. దర్శకులు అనుకుంటున్నట్టుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండూ పూర్తయితే మరోసారి ఈ వెటరన్ సూపర్స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వద్ద అమీ తుమీ చూడవచ్చు.
This post was last modified on September 23, 2020 7:28 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…