చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ అంటే ఫాన్స్ ఉర్రూతలూగిపోయేవారు. మొన్నామధ్య సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలయ్యాయి. రెండూ హిట్టయినా కానీ పైచేయి మాత్రం చిరంజీవి సాధించారు. కాకపోతే రెండూ మాస్ సినిమాలయితే ఆ క్లాష్ మరింత రసవత్తరంగా వుండేది. అలాంటి రసవత్తర పోటీ జరిగే అవకాశం వుందని ఇప్పుడు వినిపిస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ చిత్రాన్ని ఏప్రిల్ 30కి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అది సింహా రిలీజ్ డేట్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం కలిసి వస్తుందని ఆ డేట్ అనుకుంటున్నారు కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా తెలీదు.
రెండు చిత్రాలు నవంబర్లోనే మళ్లీ సెట్స్కి వెళ్లవచ్చు. దర్శకులు అనుకుంటున్నట్టుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండూ పూర్తయితే మరోసారి ఈ వెటరన్ సూపర్స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వద్ద అమీ తుమీ చూడవచ్చు.
This post was last modified on September 23, 2020 7:28 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…