చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ అంటే ఫాన్స్ ఉర్రూతలూగిపోయేవారు. మొన్నామధ్య సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలయ్యాయి. రెండూ హిట్టయినా కానీ పైచేయి మాత్రం చిరంజీవి సాధించారు. కాకపోతే రెండూ మాస్ సినిమాలయితే ఆ క్లాష్ మరింత రసవత్తరంగా వుండేది. అలాంటి రసవత్తర పోటీ జరిగే అవకాశం వుందని ఇప్పుడు వినిపిస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ చిత్రాన్ని ఏప్రిల్ 30కి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అది సింహా రిలీజ్ డేట్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం కలిసి వస్తుందని ఆ డేట్ అనుకుంటున్నారు కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా తెలీదు.
రెండు చిత్రాలు నవంబర్లోనే మళ్లీ సెట్స్కి వెళ్లవచ్చు. దర్శకులు అనుకుంటున్నట్టుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండూ పూర్తయితే మరోసారి ఈ వెటరన్ సూపర్స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వద్ద అమీ తుమీ చూడవచ్చు.
This post was last modified on September 23, 2020 7:28 pm
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న…
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…