‘రంగ్ దే’ చిత్రానికి విదేశాలలో తీయాలని ప్లాన్ చేసినదంతా ఇప్పుడు హైదరాబాద్లోనే కానిచ్చేస్తున్నారు. ఈ లాక్డౌన్లో ముందుగా అనుకున్న కొన్ని అంశాలను దర్శకుడు వెంకీ అట్లూరి మార్చి రాసుకున్నాడట. అందుకే ఇప్పుడు లొకేషన్ మారినా పెద్ద ఇబ్బందేమీ లేదట. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసే ఆలోచన వుందని నిర్మాత నాగవంశీ చెబితే నితిన్ అభ్యంతరం చెప్పలేదట.
ఈ బ్యానర్తో నితిన్కి చాలా మంచి సంబంధాలున్నాయి. ఈ సంస్థలోనే అ ఆ, భీష్మ లాంటి హిట్ సినిమాలు చేసిన నితిన్ థియేట్రికల్గానే విడుదల చేయాలనే ఆంక్షలేవీ పెట్టకుండా నిర్మాతకు ఏది లాభం అనుకుంటే అది చేయమని చెప్పాడట. రంగ్ దే చిత్రానికి జీ 5 నుంచి చాలా మంచి డీల్ వచ్చిందని, వాళ్లు 36 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా వున్నారని, అయితే ఇక శాటిలైట్, హిందీ డబ్బింగ్ వగైరా ఏమీ వుండవని సమాచారం.
మరో రెండు కోట్లు పెంచితే ఇచ్చేయడానికి నిర్మాత సిద్ధంగానే వున్నాడని, ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. బ్యాలన్స్ షూటింగ్ అయితే మొదలు పెట్టేసారు. అక్టోబర్ ఎండ్కి షూట్ పూర్తి చేసుకుని అప్పటి పరిస్థితులను బట్టి కాల్ తీసుకుంటారు. ఈ సినిమా పూర్తి చేసేస్తే అంధాధూన్ రీమేక్ మొదలు పెట్టాలని నితిన్ తొందర పడుతున్నాడు.
This post was last modified on September 23, 2020 7:24 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…