‘రంగ్ దే’ చిత్రానికి విదేశాలలో తీయాలని ప్లాన్ చేసినదంతా ఇప్పుడు హైదరాబాద్లోనే కానిచ్చేస్తున్నారు. ఈ లాక్డౌన్లో ముందుగా అనుకున్న కొన్ని అంశాలను దర్శకుడు వెంకీ అట్లూరి మార్చి రాసుకున్నాడట. అందుకే ఇప్పుడు లొకేషన్ మారినా పెద్ద ఇబ్బందేమీ లేదట. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేసే ఆలోచన వుందని నిర్మాత నాగవంశీ చెబితే నితిన్ అభ్యంతరం చెప్పలేదట.
ఈ బ్యానర్తో నితిన్కి చాలా మంచి సంబంధాలున్నాయి. ఈ సంస్థలోనే అ ఆ, భీష్మ లాంటి హిట్ సినిమాలు చేసిన నితిన్ థియేట్రికల్గానే విడుదల చేయాలనే ఆంక్షలేవీ పెట్టకుండా నిర్మాతకు ఏది లాభం అనుకుంటే అది చేయమని చెప్పాడట. రంగ్ దే చిత్రానికి జీ 5 నుంచి చాలా మంచి డీల్ వచ్చిందని, వాళ్లు 36 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా వున్నారని, అయితే ఇక శాటిలైట్, హిందీ డబ్బింగ్ వగైరా ఏమీ వుండవని సమాచారం.
మరో రెండు కోట్లు పెంచితే ఇచ్చేయడానికి నిర్మాత సిద్ధంగానే వున్నాడని, ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయని తెలిసింది. బ్యాలన్స్ షూటింగ్ అయితే మొదలు పెట్టేసారు. అక్టోబర్ ఎండ్కి షూట్ పూర్తి చేసుకుని అప్పటి పరిస్థితులను బట్టి కాల్ తీసుకుంటారు. ఈ సినిమా పూర్తి చేసేస్తే అంధాధూన్ రీమేక్ మొదలు పెట్టాలని నితిన్ తొందర పడుతున్నాడు.
This post was last modified on September 23, 2020 7:24 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…