సూపర్ స్టార్ రజినీకాంత్ తెర మీద ఎంత హంగామా చేస్తారో.. బయట అంత సింపుల్గా ఉంటారు. ఇండియన్ స్టార్ హీరోల్లో రజినీ అంత సింపుల్గా ఇంకెవ్వరూ కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. బయట ఆడంబరాలకు పూర్తి దూరంగా కనిపించే రజినీకాంత్.. ఏదైనా వేడుకకు హాజరైనా కూడా సింపుల్గానే కనిపిస్తారు, వ్యవహరిస్తారు.
అలాంటి వ్యక్తి ఓ పెళ్లి వేడుకలో చిన్న కుర్రాడిలా డ్యాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పెళ్లి భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబంలోనిదని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని ముకేశ్ కొన్ని రోజులుగా ఎంత ఆడంబరంగా నిర్వహిస్తున్నారో తెలిసిందే. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో సెలబ్రెటీలు అతిథులుగా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి కూడా మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్, రానా, అఖిల్ అక్కినేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం కుటుంబంతో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఐతే రజినీ ఈ ఈవెంట్కు హాజరవడం వరకు ఓకే కానీ.. ఆయన మిగతా అతిథులతో కలిసి డ్యాన్స్ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. రజినీ స్వచ్ఛందంగా ఇలా డ్యాన్స్ చేశాడా.. లేక చుట్టూ ఉన్న వాళ్లు బలవంతపెడితే ఇలా చేశారా అన్నది తెలియదు కానీ.. దీని పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపించింది.
కొందరు రజినీ ఉత్సాహాన్ని కొనియాడితే.. చాలామంది సూపర్ స్టార్ స్థాయి వ్యక్తికి ఇలా అంబానీల ఫ్యామిలీ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. డబ్బుంటే ఎవరితో ఏ పనైనా చేయించవచ్చు అనడానికి ఇది ఉదాహరణ అని.. సెలబ్రెటీలను అంబాని షో పీస్ల మాదిరి వాడుకుంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తన కూతుళ్ల పెళ్లిలో అయినా రజినీ ఇలా చేశాడో లేదో కానీ.. ఇలా ప్రైవేటు వేడుకలో రజినీ డ్యాన్స్ చేయడం మాత్రం అరుదైన దృశ్యం అనే చెప్పాలి.
This post was last modified on July 13, 2024 6:39 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…