సూపర్ స్టార్ రజినీకాంత్ తెర మీద ఎంత హంగామా చేస్తారో.. బయట అంత సింపుల్గా ఉంటారు. ఇండియన్ స్టార్ హీరోల్లో రజినీ అంత సింపుల్గా ఇంకెవ్వరూ కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. బయట ఆడంబరాలకు పూర్తి దూరంగా కనిపించే రజినీకాంత్.. ఏదైనా వేడుకకు హాజరైనా కూడా సింపుల్గానే కనిపిస్తారు, వ్యవహరిస్తారు.
అలాంటి వ్యక్తి ఓ పెళ్లి వేడుకలో చిన్న కుర్రాడిలా డ్యాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పెళ్లి భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబంలోనిదని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని ముకేశ్ కొన్ని రోజులుగా ఎంత ఆడంబరంగా నిర్వహిస్తున్నారో తెలిసిందే. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో సెలబ్రెటీలు అతిథులుగా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి కూడా మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్, రానా, అఖిల్ అక్కినేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం కుటుంబంతో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఐతే రజినీ ఈ ఈవెంట్కు హాజరవడం వరకు ఓకే కానీ.. ఆయన మిగతా అతిథులతో కలిసి డ్యాన్స్ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. రజినీ స్వచ్ఛందంగా ఇలా డ్యాన్స్ చేశాడా.. లేక చుట్టూ ఉన్న వాళ్లు బలవంతపెడితే ఇలా చేశారా అన్నది తెలియదు కానీ.. దీని పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపించింది.
కొందరు రజినీ ఉత్సాహాన్ని కొనియాడితే.. చాలామంది సూపర్ స్టార్ స్థాయి వ్యక్తికి ఇలా అంబానీల ఫ్యామిలీ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. డబ్బుంటే ఎవరితో ఏ పనైనా చేయించవచ్చు అనడానికి ఇది ఉదాహరణ అని.. సెలబ్రెటీలను అంబాని షో పీస్ల మాదిరి వాడుకుంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తన కూతుళ్ల పెళ్లిలో అయినా రజినీ ఇలా చేశాడో లేదో కానీ.. ఇలా ప్రైవేటు వేడుకలో రజినీ డ్యాన్స్ చేయడం మాత్రం అరుదైన దృశ్యం అనే చెప్పాలి.
This post was last modified on July 13, 2024 6:39 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…