సూపర్ స్టార్ రజినీకాంత్ తెర మీద ఎంత హంగామా చేస్తారో.. బయట అంత సింపుల్గా ఉంటారు. ఇండియన్ స్టార్ హీరోల్లో రజినీ అంత సింపుల్గా ఇంకెవ్వరూ కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. బయట ఆడంబరాలకు పూర్తి దూరంగా కనిపించే రజినీకాంత్.. ఏదైనా వేడుకకు హాజరైనా కూడా సింపుల్గానే కనిపిస్తారు, వ్యవహరిస్తారు.
అలాంటి వ్యక్తి ఓ పెళ్లి వేడుకలో చిన్న కుర్రాడిలా డ్యాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పెళ్లి భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబంలోనిదని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని ముకేశ్ కొన్ని రోజులుగా ఎంత ఆడంబరంగా నిర్వహిస్తున్నారో తెలిసిందే. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో సెలబ్రెటీలు అతిథులుగా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి కూడా మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్, రానా, అఖిల్ అక్కినేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం కుటుంబంతో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఐతే రజినీ ఈ ఈవెంట్కు హాజరవడం వరకు ఓకే కానీ.. ఆయన మిగతా అతిథులతో కలిసి డ్యాన్స్ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. రజినీ స్వచ్ఛందంగా ఇలా డ్యాన్స్ చేశాడా.. లేక చుట్టూ ఉన్న వాళ్లు బలవంతపెడితే ఇలా చేశారా అన్నది తెలియదు కానీ.. దీని పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపించింది.
కొందరు రజినీ ఉత్సాహాన్ని కొనియాడితే.. చాలామంది సూపర్ స్టార్ స్థాయి వ్యక్తికి ఇలా అంబానీల ఫ్యామిలీ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. డబ్బుంటే ఎవరితో ఏ పనైనా చేయించవచ్చు అనడానికి ఇది ఉదాహరణ అని.. సెలబ్రెటీలను అంబాని షో పీస్ల మాదిరి వాడుకుంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తన కూతుళ్ల పెళ్లిలో అయినా రజినీ ఇలా చేశాడో లేదో కానీ.. ఇలా ప్రైవేటు వేడుకలో రజినీ డ్యాన్స్ చేయడం మాత్రం అరుదైన దృశ్యం అనే చెప్పాలి.
This post was last modified on July 13, 2024 6:39 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…