పంజా బ్రదర్స్ ఎవరనుకుంటున్నారా? చిరంజీవి మేనల్లుళ్లు… సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. పెద్ద మేనల్లుడు ఇంటి పేరు స్క్రీన్ నేమ్గా పెట్టుకోలేదు కానీ వైష్ణవ్ మాత్రం న్యూమరాలజీ ప్రకారం ఇంటి పేరు కూడా స్క్రీన్ నేమ్కి జత చేసుకున్నాడు. వైష్ణవ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ కరోనా కారణంగా రిలీజ్ కాలేదింకా. ఆ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
అతను అప్పుడే తన రెండవ చిత్రం మొదలు పెట్టేసాడు. క్రిష్ డైరెక్షన్లో ‘కొండ పొలం’ నవల ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో వైష్ణవ్ నటిస్తున్నాడు. కరోనా టైమ్లో మిగిలిపోయిన సినిమాల షూటింగ్స్ మాత్రమే అందరూ మొదలు పెడితే ఇతను మాత్రం ఏకంగా కొత్త సినిమా మొదలు పెట్టాడు. సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ పూర్తి చేసేసాడు.
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని జీ 5లో విడుదల చేయబోతున్నారు. కరోనా తగ్గే వరకు ఖాళీగా వుండడం ఇష్టం లేక తేజ్ తన కొత్త సినిమా కూడా మొదలు పెట్టేస్తున్నాడు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్ అక్టోబర్లో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక కొత్త కుర్రాడి దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే’ నిర్మాతలకే తేజ్ మరో సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు.
This post was last modified on September 23, 2020 7:16 pm
అదేంటో గానీ…జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమమూ ప్రత్యేకంగానే నిలుస్తోంది. ఏదో సినిమా…
ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి బహిరంగ వేదికపై స్వల్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మాటలు చెప్పొద్దు.. చేతలకు రండి!' అని…
భారత్ను ఢీ కొంటామని.. తగిన విధంగా బుద్ది చెబుతామని బీరాలు పలికిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చుట్టూ…
హిట్ 3 ది థర్డ్ కేస్ మొదటి వారంలోనే వంద కోట్ల గ్రాస్ దాటేసి విజయవంతంగా రెండో వారంలోకి అడుగు…
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…