‘భారతీయుడు-2’ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని కమల్ హాసన్ అభిమానులు కంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం.. ‘భారతీయుడు-2 తీసిన శంకరే చరణ్తో ‘గేమ్ చేంజర్’ తీస్తున్నాడు. ముందుగా ఇండియన్-2 రిలీజ్ కావడంతో ఆ సినిమా ఎలా ఉంటుందో చూసి గేమ్ చేంజర్ ఔట్ పుట్ మీద ఒక అంచనాకు రావాలనుకుంటున్నారు.
ఐతే ఈ రోజు ‘ఇండియన్-2’ రిలీజైపోయింది. ఇది శంకర్ కెరీర్లోనే అట్టడుగున నిలిచే సినిమా అని ముక్తకంఠంతో చెబుతున్నారు ప్రేక్షకులు. శంకర్ కెరీర్లో ఫెయిల్యూర్లు లేవని కాదు. బాయ్స్, ఐ సినిమాలు ఫెయిలయ్యాయి. 2.0 కూడా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ వాటిలో శంకర్ మార్కు కనిపిస్తుంది. దర్శకుడిగా ఆయన పూర్తి ఫెయిలయ్యారని చెప్పలేం. కానీ ‘ఇండియన్-2’ అలా కాదు. ఇన్నాళ్లూ శంకర్ సినిమాలను ఎంజాయ్ చేసిన వాళ్లకు ఇది ఆయన సినిమానే అని చెబితే నమ్మలేని పరిస్థితి.
తాను క్రియేట్ చేసిన సేనాపతి కల్ట్ క్యారెక్టర్నే ఈ సినిమాలో ఆయన తేల్చి పడేసిన తీరు ప్రేక్షకులకు పెద్ద షాకే. ఈ సినిమా చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్కు ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ విషయంలో గుబులు రేగుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. శంకర్ ఇదే నైపుణ్యాన్ని చరణ్ సినిమాలో కూడా చూపిస్తే దాని పరిస్థితి ఏం కాను అని కంగారు పడుతున్నారు. శంకర్ దర్శకుడిగా ఇంతగా ఏ సినిమాలోనూ ఫెయిలైంది లేదు. ‘ఇండియన్-2’ చూసిన వాళ్లు ఆయన పనైపోయింది అని తీర్మానించేస్తున్నారు. ‘ఇండియన్-2’ తీస్తున్న సమయంలోనే ఆయన ‘గేమ్ చేంజర్’ కూడా చేసిన నేపథ్యంలో అందులో మాత్రం ఔట్ పుట్ గొప్పగా ఉంటుందా అని సందేహిస్తున్నారు. కాకపోతే ఆ సినిమాకు కథ రాసింది శంకర్ కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథతో శంకర్ ఆ చిత్రం చేశాడు.
ట్రెండీగా ఆలోచించే కార్తీక్.. కథలో తన ప్రత్యేకతను చాటుకునే ఉంటాడని ఆశించవచ్చు. కథల విషయంలో శంకర్ తడబడుతుండొచ్చు కానీ.. మంచి కథ పడితే ఇప్పటికీ ఆయన్నుంచి మెరుపులు చూడొచ్చని అభిమానులు అంటున్నారు. కాబట్టి ‘గేమ్ చేంజర్’ విషయంలో శంకర్ నుంచి భిన్నమైన సినిమా చూడొచ్చేమో అని చరణ్ అభిమానులు ఆశ పడుతున్నారు.
This post was last modified on July 12, 2024 9:15 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…