బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీనుల కొత్త మూవీ ఓపెనింగ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సింహా, లెజెండ్, అఖండలతో ఒకదాన్ని మించి మరొకటి హ్యాట్రిక్ సాధించిన ఈ కలయిక త్వరలో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా సినిమాను దసరా లేదా దీపావళి నుంచి మొదలుపెట్టే ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో నిర్మాణంలో ఉన్న బాలయ్య 109 పూర్తయ్యాక శీనుది సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. ఇది అఖండ 2నేని పక్కా సమాచారం.
ఇందులో ఏ అంశాలు ఉంటాయనే దాని మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సీక్వెల్ ప్రధానంగా అఘోరా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందట. ఎన్నికల ముందు బోయపాటి శీను రాసుకున్న వెర్షన్ లో గత ప్రభుత్వం మీద ఘాటైన సెటైర్లు, ఎపిసోడ్లు ఉన్నాయట. ఎలాగూ టిడిపి కూటమి గెలుస్తుందనే నమ్మకంతో స్క్రిప్ట్ ని పకడ్బందీగా సిద్ధం చేసుకున్నారట. అదే జరిగింది. దీంతో ఒక్క డైలాగు మార్చకుండా యధాతథంగా ఫస్ట్ లాక్ చేసుకున్న కథతోనే ముందుకెళ్లబోతున్నారని తెలిసింది. అఘోరా ఫ్లాష్ బ్యాక్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలిసింది.
హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తో సహా స్టోరీ ప్రకారం బ్రతికి ఉన్న ప్రధాన పాత్రలన్నీ కంటిన్యూ కాబోతున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడిని వెతికే పనిలో బోయపాటి శీను ఉన్నట్టు తెలిసింది. ప్రతినాయక పాత్రలను చాలా పవర్ ఫుల్ గా రాసుకునే ఈ మాస్ డైరెక్టర్ ఈసారి వయొలెన్స్ ని ఇంకో లెవెల్ లో చూపిస్తారని వినికిడి. స్కంద ఊహించని విధంగా చేదు ఫలితం ఇవ్వడంతో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ 2ని వచ్చే ఏడాది దసరా విడుదలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వేసవిలోగా షూట్ పూర్తి చేయాలనేది బాలయ్య బోయపాటి టార్గెట్.
This post was last modified on July 11, 2024 3:41 pm
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…