Movie News

అఖండ 2లో ఏం చెప్పబోతున్నారు

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీనుల కొత్త మూవీ ఓపెనింగ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సింహా, లెజెండ్, అఖండలతో ఒకదాన్ని మించి మరొకటి హ్యాట్రిక్ సాధించిన ఈ కలయిక త్వరలో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా సినిమాను దసరా లేదా దీపావళి నుంచి మొదలుపెట్టే ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో నిర్మాణంలో ఉన్న బాలయ్య 109 పూర్తయ్యాక శీనుది సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. ఇది అఖండ 2నేని పక్కా సమాచారం.

ఇందులో ఏ అంశాలు ఉంటాయనే దాని మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సీక్వెల్ ప్రధానంగా అఘోరా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందట. ఎన్నికల ముందు బోయపాటి శీను రాసుకున్న వెర్షన్ లో గత ప్రభుత్వం మీద ఘాటైన సెటైర్లు, ఎపిసోడ్లు ఉన్నాయట. ఎలాగూ టిడిపి కూటమి గెలుస్తుందనే నమ్మకంతో స్క్రిప్ట్ ని పకడ్బందీగా సిద్ధం చేసుకున్నారట. అదే జరిగింది. దీంతో ఒక్క డైలాగు మార్చకుండా యధాతథంగా ఫస్ట్ లాక్ చేసుకున్న కథతోనే ముందుకెళ్లబోతున్నారని తెలిసింది. అఘోరా ఫ్లాష్ బ్యాక్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలిసింది.

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తో సహా స్టోరీ ప్రకారం బ్రతికి ఉన్న ప్రధాన పాత్రలన్నీ కంటిన్యూ కాబోతున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడిని వెతికే పనిలో బోయపాటి శీను ఉన్నట్టు తెలిసింది. ప్రతినాయక పాత్రలను చాలా పవర్ ఫుల్ గా రాసుకునే ఈ మాస్ డైరెక్టర్ ఈసారి వయొలెన్స్ ని ఇంకో లెవెల్ లో చూపిస్తారని వినికిడి. స్కంద ఊహించని విధంగా చేదు ఫలితం ఇవ్వడంతో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ 2ని వచ్చే ఏడాది దసరా విడుదలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వేసవిలోగా షూట్ పూర్తి చేయాలనేది బాలయ్య బోయపాటి టార్గెట్.

This post was last modified on July 11, 2024 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

53 seconds ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

30 minutes ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

2 hours ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

2 hours ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

3 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

3 hours ago