కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టి వెబ్ సిరీస్ తీయడంలో నెట్ ఫ్లిక్స్ పాటించే స్ట్రాటజీనే వేరు. కంటెంట్ కంటే కాంట్రావర్సినే ఆ కంపెనీను ఎక్కువగా ఆకట్టుకుంటుందని డిజిటల్ వర్గాలు బహిరంగంగానే కామెంట్ చేసుకుంటాయి. ఇటీవలే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ మహారాజ్ విడుదలకు ముందు ఎంత దుమారం రేపిందో చూశాం. దర్శకుడు, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. బొమ్మ డిజాస్టర్ అయిపోయింది కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు కానీ లేదంటే అందులోని వివాదాస్పద అంశాల పట్ల సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగేది.
తాజాగా మరో వెబ్ సిరీస్ విషయంలో నెట్ ఫ్లిక్స్ ఇబ్బందులు ఎదురుకుంటోంది. త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్ తాలూకు ట్రైలర్ కాంట్రవర్సీకి కేంద్రంగా మారుతోంది. ఇందులో కథ ప్రకారం సిఏ చదువులో టాప్ ర్యాంకర్ గా నిలిచిన హీరో ఒంటరి మహిళలకు లైంగిక సేవలు అందిస్తుంటాడు. అంటే కాల్ బాయ్ తరహాలో అన్న మాట. దీన్ని చూసిన ఐసిఏఐ ( ఇన్స్ టిట్యూట్ అఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్) భగ్గుమంది. ఎంతో ఉన్నతమైన వృత్తిని ఇలా చూపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ డాక్టర్ రోహిత్ రువాతియ అగర్వాల్ అనే వ్యక్తి ఐఎఫ్ఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించాడు.
కాకపోతే సినిమా అనేది ఒక కాల్పనిక మాధ్యమం. వృత్తిని బట్టి పెంచడం తగ్గించడం లాంటివి ఉండవు. డాక్టర్లు, లాయర్లు, మినిస్టర్లు ఇలా ఎన్నో ఉన్నత విద్యావంతుల చీకటి కోణాలను తెరమీద చూపించడం కొత్తేమి కాదు. అలాంటిది సిఏలను మాత్రం చాలా ప్రత్యేకం, మమ్మల్ని మినహాయించాలని చెప్పడం వింతే. ఆ మాటకొస్తే కార్పొరేట్ కంపెనీల వందల వేల కోట్ల మోసాల వెనుక చక్రం తిప్పేది ఎవరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇప్పుడీ మ్యాటర్ కోర్టు దాకా వెళ్తుందో లేదో కానీ మహరాజ్ అంత సీరియస్ ఇష్యూ కాకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయం. జూలై 18 నుంచి స్ట్రీమింగ్ మొదలుకానుంది.
This post was last modified on July 11, 2024 12:02 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…