తండ్రి కూతుళ్ళ వీడియోని తీసుకుని దాని మీద అసభ్యకర వ్యాఖ్యలతో లైవ్ నిర్వహించిన కేసులో యుట్యూబర్ ప్రణీత్ హనుమంతు నిన్న అరెస్ట్ కావడం సంచలనం రేపింది. సోషల్ మీడియా బలమెంతో మరోసారి ఋజువయ్యింది. సామాజిక మాధ్యమాల పాత్ర ఎంత ఉన్నా ఈసారి టాలీవుడ్ యువ హీరోలు తీసుకున్న చొరవే ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చిందని చెప్పాలి. ముందుగా సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ప్రశంసలు దక్కాల్సిందే. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులను ట్యాగ్ చేయడంతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ దృష్టికి దీన్ని త్వరగా తీసుకెళ్లడంలో సుప్రీమ్ హీరో చూపించిన చొరవ గొప్పది.
తర్వాత మంచు మనోజ్ ఇంతే సీరియస్ గా ఈ ఇష్యూని మరో నలుగురికి తెలిసేలా చేయడంతో క్రమంగా ఇతరులు ఇందులో భాగమయ్యారు. విశ్వక్ సేన్ ట్విట్టర్ వేదికగా స్పందించగా, తమ హరోంహర సినిమాలో ప్రణీత్ ని తీసుకుని పొరపాటు చేశామని సుధీర్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పడం అరుదైన సంఘటన. భజే వాయు వేగం ప్రమోషన్ల కోసం సదరు ప్రణీత్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తప్పు చేశానని, ఇలాంటి వాళ్ళను క్షమించకూడదని కార్తికేయ ఓపెన్ ఆపాలజీ చెప్పడం కదిలించింది. నిజానికి ఇతని తప్పేమీ లేదు. మంచు లక్ష్మి ఏకంగా నరికి పారేయాలనేంత ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిన్న మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒక వీడియో రిలీజ్ చేసి అశ్లీల వీడియోలు, సినిమా తారల మీద బూతు కంటెంట్ తయారు చేసిన వాళ్ళు ఎవరైనా రెండు రోజుల్లో అన్ని డిలీట్ చేయాలని లేదంటే కఠిన చర్యలు ఉంటాయనని హెచ్చరించడం మరో ముందడుగు. ఇలా అందరూ కలిసికట్టుగా యువతను ప్రభావితం చేస్తున్న ఆన్ లైన్ మహమ్మారి మీద కలిసికట్టుగా పోరాటం చేయడం వేరొకరిని తప్పు చేయకుండా నిలువరిస్తుంది. నేరం చేసిన వాడికి శిక్ష పడటం ఎంత ముఖ్యమో అలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవడం అంతేకన్నా పెద్ద బాధ్యత. హీరోలు నిర్వర్తిస్తోంది ఇదే.
This post was last modified on July 11, 2024 10:02 am
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…