ఇప్పుడు ఏదైనా ఓ పెద్ద సినిమా మేకింగ్ దశలో ఉందంటే.. అది ఒక భాగానికి పరిమితం కావడం కష్టంగానే ఉంది. ముందు ఒక సినిమాగా మొదలుపెట్టి తర్వాత రెండు మూడు భాగాలుగా తీస్తున్నారు. బాహుబలితో మొదలైన ఈ ఒరవడిని కేజీఎఫ్, పుష్ప సహా చాలా సినిమాలు కొనసాగించాయి. దేవర, సలార్, కల్కి.. ఇలా ఈ జాబితాలో చాలా సినిమాలే కనిపిస్తాయి. ఇప్పుడు మరో భారీ చిత్రం ఈ జాబితాలోకి చేరింది. అదే.. కంగువ.
సూర్య హీరోగా శివ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అదిరిపోయే ప్రోమోలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దసరా కానుకగా అక్టోబరు 10న కంగువను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశాడు.
ఐతే కంగువ-2 మొదలు కావడానికి చాలానే టైం పడుతుందట. వచ్చే ఏడాది చివర్లో కానీ.. 2026 ఆరంభంలో కానీ మొదలై ఇంకో ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందట. కంగువ ప్రోమోలు చూస్తే మాత్రం ఇదొక ఎపిక్ మూవీ అవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శివ ఇప్పటిదాకా రొటీన్ మాస్ మూవీసే చేశాడు కానీ.. కంగువలో మాత్రం మైండ్ బ్లోయింగ్ విజువల్స్తో ఆశ్చర్యపరిచాడు.
సూర్య నెవర్ బిఫోర్ అవతార్లో కనిపించనున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ లాంటి పవర్ ఫుల్ విలన్ నటించాడు. యానిమల్తో అతడికి బంపర్ క్రేజ్ వచ్చింది. సూర్య సరసన దిశా పఠాని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. త్వరలోనే కంగువ సెకండ్ టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
This post was last modified on July 9, 2024 10:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…