ఇప్పుడు ఏదైనా ఓ పెద్ద సినిమా మేకింగ్ దశలో ఉందంటే.. అది ఒక భాగానికి పరిమితం కావడం కష్టంగానే ఉంది. ముందు ఒక సినిమాగా మొదలుపెట్టి తర్వాత రెండు మూడు భాగాలుగా తీస్తున్నారు. బాహుబలితో మొదలైన ఈ ఒరవడిని కేజీఎఫ్, పుష్ప సహా చాలా సినిమాలు కొనసాగించాయి. దేవర, సలార్, కల్కి.. ఇలా ఈ జాబితాలో చాలా సినిమాలే కనిపిస్తాయి. ఇప్పుడు మరో భారీ చిత్రం ఈ జాబితాలోకి చేరింది. అదే.. కంగువ.
సూర్య హీరోగా శివ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అదిరిపోయే ప్రోమోలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దసరా కానుకగా అక్టోబరు 10న కంగువను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశాడు.
ఐతే కంగువ-2 మొదలు కావడానికి చాలానే టైం పడుతుందట. వచ్చే ఏడాది చివర్లో కానీ.. 2026 ఆరంభంలో కానీ మొదలై ఇంకో ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందట. కంగువ ప్రోమోలు చూస్తే మాత్రం ఇదొక ఎపిక్ మూవీ అవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శివ ఇప్పటిదాకా రొటీన్ మాస్ మూవీసే చేశాడు కానీ.. కంగువలో మాత్రం మైండ్ బ్లోయింగ్ విజువల్స్తో ఆశ్చర్యపరిచాడు.
సూర్య నెవర్ బిఫోర్ అవతార్లో కనిపించనున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ లాంటి పవర్ ఫుల్ విలన్ నటించాడు. యానిమల్తో అతడికి బంపర్ క్రేజ్ వచ్చింది. సూర్య సరసన దిశా పఠాని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. త్వరలోనే కంగువ సెకండ్ టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
This post was last modified on July 9, 2024 10:04 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…