వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు. గుంటూరు కారం విడుదల తర్వాత బయట ఎక్కువ కనిపించకుండా ఉన్న సూపర్ స్టార్ ప్రస్తుతం రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటిదాకా రాలేదు. బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాన్సెప్ట్ టీజర్ ని సిద్ధం చేయించే పనిలో జక్కన్న బిజీగా ఉన్నాడన్న మాట నిజమే. కానీ ఫైనల్ లుక్ పూర్తి సంతృప్తి ఇస్తే తప్ప ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వరనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు ట్రయిల్ షూట్స్ జరిగినా వాటి డీటెయిల్స్ ని గోప్యంగా ఉంచారు.
ఆర్ఆర్ఆర్ తరహాలో ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రాజెక్టు వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారాని అభిమానులు, మీడియా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి కథతో సహా దేన్నీ దాచి పెట్టరు. మొత్తం ఓపెన్ గా చెప్పేసి తెరమీద థ్రిల్ చేయడం ముందు నుంచి ఉన్న అలవాటు. దీనికీ అదే ఫాలో అవ్వొచ్చు. కాకపోతే ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఎలాంటి కానుక ఇస్తారనే ఎగ్జైట్ మెంట్ మూవీ లవర్స్ లో చాలా ఉంది. రెండేళ్లకు పైగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వీడియో వదలాలనే పట్టు రాజమౌళికి ఉండకపోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నమైతే జరుగుతోంది.
కాసేపు దీని సంగతి పక్కనపెడితే ఖలేజా లేదా మురారి రెండింటిలో ఒకదాన్ని భారీగా రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మురారికి సంబంధించిన 4కె పనులు ఆల్రెడీ పూర్తయ్యాయట. ఖలేజా ఎలాగూ డిజిటల్ ప్రింట్ కాబట్టి పెద్దగా వ్యయ ప్రయాసలు ఉండవు. ఇంకో నెల రోజుల పాటు ఫ్యాన్స్ ఈ రెండు అప్డేట్స్ కి సంబంధించిన సస్పెన్స్ ని భరించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఎంత లేట్ అయినా రాజమౌళి సినిమా తప్ప వేరే ఏ కమిట్ మెంట్ లేకుండా మహేష్ బాబు తన డైరీని లాక్ చేసుకోబోతున్నాడు. అది ఎన్ని నెలలు లేదా సంవత్సరాలనేది ఎవరూ చెప్పలేరు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…