తన అందాల్ని విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో మంటలు రేపే బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆమె నటించిన సినిమాల కంటే కూడా.. సోషల్ మీడియాలో ఆమె చేసే లొల్లే ఎక్కువగా ఉంటుంది. తన అందాల్ని విస్తారంగా ప్రదర్శించే ఆమె.. ఎప్పటికప్పుడు సంచలన స్టేట్ మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.
పదిహేను రోజుల క్రితం ఆమె పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలుగా ప్రేమించుకున్న సామ్ బాంబే ను ఆమె పెళ్లాడారు. పెళ్లికి సంబంధించిన ఫోటోల్ని ఆమె షేర్ చేశారు. అంతేకాదు.. తమ ఇద్దరి ఎంగేజ్ మెంట్ రింగుల్ని ప్రదర్శించటమేకాదు.. సన్నిహితంగా ఉన్ ఫోటోల్ని పోస్టు చేశారు. ఇద్దరు అన్యోన్యంగా ఎంజాయ్ చేస్తున్నారని అందరు అనుకుంటున్న వేళ.. ఊహించని రీతిలో పోలీసులకు భర్త మీద ఫిర్యాదు చేసింది పూనమ్.
తాజాగా ఒక సినిమా షూటింగ్ కోసం గోవాకు వెళ్లింది ఈ బ్యూటీ. ఏమైందో ఏమో కానీ.. తన భర్త సామ్ తనను వేధిస్తున్నాడంటూ కెనాకోనా గ్రామ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. పూనమ్ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఆమె భర్తను మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం పూనమ్ ను వైద్య పరీక్షలకు పంపారు.
కొన్ని నెలలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పూనమ్.. కేవలం పదిహేను రోజులకే కంప్లైంట్ చేశారని ఆరోపించటం.. ఆ వెంటనే అతగాడ్ని పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఎందుకిలా జరిగిందన్న విషయంపై మరింత స్పష్టత రావాలంటే.. పూనమ్ భర్త సామ్ నోరు విప్పితేనే కానీ తేలదన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on September 23, 2020 10:52 am
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…