తన అందాల్ని విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో మంటలు రేపే బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆమె నటించిన సినిమాల కంటే కూడా.. సోషల్ మీడియాలో ఆమె చేసే లొల్లే ఎక్కువగా ఉంటుంది. తన అందాల్ని విస్తారంగా ప్రదర్శించే ఆమె.. ఎప్పటికప్పుడు సంచలన స్టేట్ మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.
పదిహేను రోజుల క్రితం ఆమె పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలుగా ప్రేమించుకున్న సామ్ బాంబే ను ఆమె పెళ్లాడారు. పెళ్లికి సంబంధించిన ఫోటోల్ని ఆమె షేర్ చేశారు. అంతేకాదు.. తమ ఇద్దరి ఎంగేజ్ మెంట్ రింగుల్ని ప్రదర్శించటమేకాదు.. సన్నిహితంగా ఉన్ ఫోటోల్ని పోస్టు చేశారు. ఇద్దరు అన్యోన్యంగా ఎంజాయ్ చేస్తున్నారని అందరు అనుకుంటున్న వేళ.. ఊహించని రీతిలో పోలీసులకు భర్త మీద ఫిర్యాదు చేసింది పూనమ్.
తాజాగా ఒక సినిమా షూటింగ్ కోసం గోవాకు వెళ్లింది ఈ బ్యూటీ. ఏమైందో ఏమో కానీ.. తన భర్త సామ్ తనను వేధిస్తున్నాడంటూ కెనాకోనా గ్రామ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. పూనమ్ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఆమె భర్తను మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం పూనమ్ ను వైద్య పరీక్షలకు పంపారు.
కొన్ని నెలలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పూనమ్.. కేవలం పదిహేను రోజులకే కంప్లైంట్ చేశారని ఆరోపించటం.. ఆ వెంటనే అతగాడ్ని పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఎందుకిలా జరిగిందన్న విషయంపై మరింత స్పష్టత రావాలంటే.. పూనమ్ భర్త సామ్ నోరు విప్పితేనే కానీ తేలదన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on September 23, 2020 10:52 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…