తన అందాల్ని విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో మంటలు రేపే బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆమె నటించిన సినిమాల కంటే కూడా.. సోషల్ మీడియాలో ఆమె చేసే లొల్లే ఎక్కువగా ఉంటుంది. తన అందాల్ని విస్తారంగా ప్రదర్శించే ఆమె.. ఎప్పటికప్పుడు సంచలన స్టేట్ మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.
పదిహేను రోజుల క్రితం ఆమె పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలుగా ప్రేమించుకున్న సామ్ బాంబే ను ఆమె పెళ్లాడారు. పెళ్లికి సంబంధించిన ఫోటోల్ని ఆమె షేర్ చేశారు. అంతేకాదు.. తమ ఇద్దరి ఎంగేజ్ మెంట్ రింగుల్ని ప్రదర్శించటమేకాదు.. సన్నిహితంగా ఉన్ ఫోటోల్ని పోస్టు చేశారు. ఇద్దరు అన్యోన్యంగా ఎంజాయ్ చేస్తున్నారని అందరు అనుకుంటున్న వేళ.. ఊహించని రీతిలో పోలీసులకు భర్త మీద ఫిర్యాదు చేసింది పూనమ్.
తాజాగా ఒక సినిమా షూటింగ్ కోసం గోవాకు వెళ్లింది ఈ బ్యూటీ. ఏమైందో ఏమో కానీ.. తన భర్త సామ్ తనను వేధిస్తున్నాడంటూ కెనాకోనా గ్రామ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. పూనమ్ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఆమె భర్తను మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం పూనమ్ ను వైద్య పరీక్షలకు పంపారు.
కొన్ని నెలలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పూనమ్.. కేవలం పదిహేను రోజులకే కంప్లైంట్ చేశారని ఆరోపించటం.. ఆ వెంటనే అతగాడ్ని పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఎందుకిలా జరిగిందన్న విషయంపై మరింత స్పష్టత రావాలంటే.. పూనమ్ భర్త సామ్ నోరు విప్పితేనే కానీ తేలదన్న మాట వినిపిస్తోంది.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…