సినిమా టైటిల్స్, వాటి దర్శకులను గుర్తు పెట్టుకోవడంలో సాధారణ ప్రేక్షకులు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాని వల్ల నిజ జీవితంలో జరిగే సంఘటనలు నవ్వించేలా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. గత ఏడాది తక్కువ అంచనాలతో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన దర్శకుడు సాయి రాజేష్ కు ఒక విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ఈయన ఫ్రెండ్ ఒకరు అతని ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళదామని పిలిచారు. ఎందుకయ్యా అంటే సదరు వ్యక్తి బేబీ మూవీకి వీరాభిమాని. యాభైసార్లు పైగానే చూశాడట. సరే ఇంటి ఫుడ్డు తిన్నట్టు ఉంటుందని సాయి రాజేష్ వెళ్లారు.
పలకరింపు ఆతిధ్యాలు అన్నీ అయ్యాయి. అపార్ట్ మెంట్ వాసులు, స్టాఫ్ తదితరులతో సెల్ఫీలు తీయించి గొప్పగా పరిచయం చేశాడు. ఇక భోజనాల సమయంలో సాయి రాజేష్ కి రుచికరమైన పదార్థాలు వడ్డిస్తూహోస్టు ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏంటయ్యా అంటే తన కూతురికి సమంత అంటే చాలా ఇష్టమని, ఎలాగైనా ఒక్క ఫోటో దిగే ఏర్పాటు చేయమని. దీంతో అసలు ట్విస్ట్ అప్పుడు అర్థమయ్యింది. అతను అప్పటిదాకా సాయి రాజేష్ ని ఓ బేబీ డైరెక్టర్ అనుకుని ఇన్ని మర్యాదలు చేశాడు. ఎలాగూ దర్శకుడు కాబట్టి ఆమెతో ఫోటో తీయించడం పెద్ద పని కాదనుకుని ఇలా విందుకు పిలిచి మరీ విన్నపం చేసుకున్నాడు.
సరే ఇంత జరిగాక ఏం చేయాలో అర్థం కాక శుభ్రంగా భోజనం చేసి రావడం సాయి రాజేష్ వంతైంది. కేవలం టైటిల్స్ లో ఉన్న ఒక్క అక్షరం వ్యత్యాసం ఇంత పని చేసిందన్న మాట. మరి ఓ బేబీ అసలు దర్శకురాలు నందిని రెడ్డి ఇదంతా చూస్తే ఏమనుకుంటారోనని నెటిజెన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. బేబీ, ఓ బేబీ పేర్లలో సారూప్యత లాగే ఫలితం కూడా బాక్సాఫీస్ వద్ద అలాగే వచ్చింది. రెండు సూపర్ హిట్లే. ఇదంతా సాయి రాజేష్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా షేర్ చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తను ప్రస్తుతం బేబీ హిందీ రీమేక్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 6, 2024 12:53 pm
అయాన్ ముఖర్జీ.. ‘వేకప్ సిద్’ అనే క్లాస్ మూవీతో పరిచయమైన బాలీవుడ్ దర్శకుడు. ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్ని…
ఇప్పుడు కరోనా ఊసే లేదు. జనం థియేటర్లకు రాని పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో కమల్ హాసన్, శంకర్ల క్రేజీ…
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు…
ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని…
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో…
కరోనా టైంలో ఓటిటి విప్లవం జనాన్ని ఏ స్థాయిలో తన వైపు తిప్పుకుందో చూస్తున్నాం. వందల కోట్ల రూపాయలను మంచి…