సినిమా టైటిల్స్, వాటి దర్శకులను గుర్తు పెట్టుకోవడంలో సాధారణ ప్రేక్షకులు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాని వల్ల నిజ జీవితంలో జరిగే సంఘటనలు నవ్వించేలా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. గత ఏడాది తక్కువ అంచనాలతో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన దర్శకుడు సాయి రాజేష్ కు ఒక విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ఈయన ఫ్రెండ్ ఒకరు అతని ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళదామని పిలిచారు. ఎందుకయ్యా అంటే సదరు వ్యక్తి బేబీ మూవీకి వీరాభిమాని. యాభైసార్లు పైగానే చూశాడట. సరే ఇంటి ఫుడ్డు తిన్నట్టు ఉంటుందని సాయి రాజేష్ వెళ్లారు.
పలకరింపు ఆతిధ్యాలు అన్నీ అయ్యాయి. అపార్ట్ మెంట్ వాసులు, స్టాఫ్ తదితరులతో సెల్ఫీలు తీయించి గొప్పగా పరిచయం చేశాడు. ఇక భోజనాల సమయంలో సాయి రాజేష్ కి రుచికరమైన పదార్థాలు వడ్డిస్తూహోస్టు ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏంటయ్యా అంటే తన కూతురికి సమంత అంటే చాలా ఇష్టమని, ఎలాగైనా ఒక్క ఫోటో దిగే ఏర్పాటు చేయమని. దీంతో అసలు ట్విస్ట్ అప్పుడు అర్థమయ్యింది. అతను అప్పటిదాకా సాయి రాజేష్ ని ఓ బేబీ డైరెక్టర్ అనుకుని ఇన్ని మర్యాదలు చేశాడు. ఎలాగూ దర్శకుడు కాబట్టి ఆమెతో ఫోటో తీయించడం పెద్ద పని కాదనుకుని ఇలా విందుకు పిలిచి మరీ విన్నపం చేసుకున్నాడు.
సరే ఇంత జరిగాక ఏం చేయాలో అర్థం కాక శుభ్రంగా భోజనం చేసి రావడం సాయి రాజేష్ వంతైంది. కేవలం టైటిల్స్ లో ఉన్న ఒక్క అక్షరం వ్యత్యాసం ఇంత పని చేసిందన్న మాట. మరి ఓ బేబీ అసలు దర్శకురాలు నందిని రెడ్డి ఇదంతా చూస్తే ఏమనుకుంటారోనని నెటిజెన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. బేబీ, ఓ బేబీ పేర్లలో సారూప్యత లాగే ఫలితం కూడా బాక్సాఫీస్ వద్ద అలాగే వచ్చింది. రెండు సూపర్ హిట్లే. ఇదంతా సాయి రాజేష్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా షేర్ చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తను ప్రస్తుతం బేబీ హిందీ రీమేక్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 6, 2024 12:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…