ఈ వారం కొత్త రిలీజులు లేకపోవడంతో కల్కి 2898 హవానే కొనసాగనుంది. ఇప్పటికే దాన్ని చూసినవాళ్లు, రిపీట్స్ పూర్తి చేసుకున్న బ్యాచ్ అందరూ భారతీయుడు 2 కోసం ఎదురు చూస్తున్నారు. బజ్ పరంగా విపరీతమైన అంచనాలు లేవు కానీ కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రం విక్రమ్ సంగతులను గుర్తు చేస్తున్నారు.
ఆ సినిమా సమయంలోనూ హైప్ అంతగా లేదు. హీరో ఇమేజ్ కన్నా లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఎక్కువ పని చేసింది. ఆ కారణంగానే డిస్ట్రిబ్యూషన్ హక్కులను చాలా తక్కువ మొత్తానికి ఇచ్చారు. కట్ చేస్తే విక్రమ్ రైట్స్ కొన్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రెట్టింపు లాభాలు కళ్లజూశారు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే భారతీయుడు 2కు బంగారంలాంటి అవకాశం కళ్లముందుంది. రెండు వారాల బాక్సాఫీస్ గ్యాప్ తో పాటు ఆపై జూలై 19న ప్రియదర్శి డార్లింగ్ లాంటి మీడియం సినిమా తప్పించి పోటీగా ఏమి లేవు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సేనాపతిగా వసూళ్ల భరతం పట్టొచ్చు. దర్శకుడు రన్ టైం 3 గంటల 4 నిమిషాలకు ఫైనల్ చేయడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. 1996లో వచ్చిన మొదటి భాగం నిడివినే దీనికి ఫాలో కావడం సెంటిమెంటో లేక కాకతాళీయంగా ఆలా కుదిరిందో వేచి చూడాలి. దుబాయ్ నుంచి చెన్నై దాకా పబ్లిసిటీ చాలా గ్రాండ్ గా చేసుకుంటూ వచ్చారు.
భారతీయుడు 2 ఫలితం మీదే మూడో భాగం బిజినెస్ ఆధారపడి ఉంది. హిట్ అయ్యిందా దానికి క్రేజ్ వస్తుంది. లేదంటే నష్టాల రికవరీ కింద తక్కువ రేట్లకు అమ్మాల్సి వస్తుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏపీ, తెలంగాణలో యాభై రూపాయల టికెట్ హైక్ అడిగే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. కానీ అంచనాల దృష్ట్యా ఈ మోడల్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనే దాని గురించి చర్చలు జరుగుతున్నాయట. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, బ్రహ్మానందం, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించిన భారతీయుడు 2కి అనిరుద్ ఇచ్చిన బిజిఎం మీద ప్రత్యేక అంచనాలున్నాయి.
This post was last modified on July 5, 2024 9:16 pm
వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…
మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…