హాలీవుడ్ సినిమాలను మనోళ్లు మక్కీకి మక్కీ దించేయడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే మన సినిమా కూడా గ్లోబల్ స్థాయికి చేరడంతో ఇప్పుడు అధికారికంగానే హక్కులు తీసుకుని రీమేక్ చేస్తున్నారు. ఐతే ఒకప్పుడైనా, ఇప్పుడైనా అక్కడి సినిమాలు ఇక్కడికి రావడమే కానీ.. మన కథలు హాలీవుడ్ స్థాయికి వెళ్లడం మాత్రం అరుదే. ఐతే ఇప్పుడో హిందీ యాక్షన్ మూవీ హాలీవుడ్లో అధికారికంగా రీమేక్ కాబోతోంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇంకా హిందీలో విడుదలే కాలేదు.
లక్ష్య అనే అప్కమింగ్ యాక్టర్గా హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని నిఖిల్ నగేశ్ భట్ రూపొందించాడు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఏడాది కిందటే పూర్తయిన ‘కిల్’.. నిరుడు టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. జులై 5న భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘కిల్’.
కాగా విడుదలకు వారం ముందే ఈ చిత్రానికి ప్రెస్ ప్రీమియర్ షో వేయగా.. చూసిన వాళ్లంతా ఆహా ఓహో అని కొనియాడుతున్నారు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ యాక్షన్ మూవీగా నిలుస్తుందంటూ అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో ‘కిల్’ హాలీవుడ్ రీమేక్ గురించి వార్త బయటికి వచ్చింది. ‘జాన్ విక్’ లాంటి మెగా మూవీని ప్రొడ్యూస్ చేసిన మేకర్స్.. ఈ చిత్రాన్ని హాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారట.
ఆర్మీ కమాండో అయిన హీరో.. దుండగుల బారిన పడ్డ తన ప్రియురాలిని కాపాడేందుకు ఒక రైలులో చేసే సాహసాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. సినిమా అంతా యాక్షన్ సన్నివేశాలతోనే నిండి ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి యాక్షన్ ఘట్టాలు ఇంతకుముందెన్నడూ చూసి ఉండరని అంటున్నారు మేకర్స్, క్రిటిక్స్. ఇండియాలో రిలీజ్ తర్వాత హాలీవుడ్ రీమేక్ మొదలవుతుందట.
This post was last modified on July 3, 2024 5:46 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…