పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్లు రేట్ల పెంపు తప్పనిసరైన నేపథ్యంలో నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకోవడం మాములే. ఎన్నికల ముందు వరకు ఏపీలో ఉన్న ఇబ్బంది ప్రభుత్వం మారడం వల్ల తొలగిపోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అంశంలో ప్రొడ్యూసర్లు టెన్షన్ పడాల్సిన పని తప్పిపోయింది. అయితే తెలంగాణ సర్కారు తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజానికి ఉపయోగపడే ఒక మెలిక పెట్టడం అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కించుకుంటోంది. దాని ప్రకారం ఇకపై వెసులుబాట్లు కోరుకునే నిర్మాతలు ఎవరైనా సరే ఒక నియమం పాటించాలి.
అదేంటంటే సమాజంలో ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా వాటి పట్ల అవగాహన కలిగించేలా పెంపులు, షూటింగ్ అనుమతులు కోరుతున్న హీరో హీరోయిన్లు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో ఏదైనా షూట్ చేసి దాన్ని ప్రత్యేకంగా పోలీస్ శాఖకు అందజేయాలి. దీని వల్ల జనాలకు త్వరగా సందేశం చేర్చడానికి వీలు పడుతుంది. టికెట్లు అధిక ధరలకు అమ్ముకోవడం బడ్జెట్ రికవరీలో భాగమే అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు మేలు జరగడం కోసం ఇలాంటి నిబంధన పెట్టాల్సి వచ్చిందని సిఎం స్పష్టం చేయడం విశేషం.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అలాంటి వీడియో ఒకటి చేయడం గుర్తు చేసి అభినందించారు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఈ దిశగా కొన్ని యాడ్స్ చేశారు కానీ క్రమం తప్పకుండ ఇవి రావడం లేదు. ఇప్పుడీ కండీషన్ వల్ల థియేటర్లకు పెద్ద ఎత్తున జనాలకు సెలబ్రిటీల ద్వారా చేరాల్సిన సందేశం త్వరగా అందుతుంది. సో టికెట్ రేట్లకు అప్లై చేసే ముందు సామాజిక అవగాహన వీడియో షూట్ చేసుకుని వినతి పత్రంతో పాటు సిడిని అందించేస్తే ఒక పనైపోతుంది. తీసింది ఏ రాష్ట్రం కోసమైనా అది అందరికి ఉపయోగపడేలా చేసుకోవచ్చు.
This post was last modified on July 2, 2024 4:21 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…