పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్లు రేట్ల పెంపు తప్పనిసరైన నేపథ్యంలో నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకోవడం మాములే. ఎన్నికల ముందు వరకు ఏపీలో ఉన్న ఇబ్బంది ప్రభుత్వం మారడం వల్ల తొలగిపోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అంశంలో ప్రొడ్యూసర్లు టెన్షన్ పడాల్సిన పని తప్పిపోయింది. అయితే తెలంగాణ సర్కారు తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజానికి ఉపయోగపడే ఒక మెలిక పెట్టడం అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కించుకుంటోంది. దాని ప్రకారం ఇకపై వెసులుబాట్లు కోరుకునే నిర్మాతలు ఎవరైనా సరే ఒక నియమం పాటించాలి.
అదేంటంటే సమాజంలో ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా వాటి పట్ల అవగాహన కలిగించేలా పెంపులు, షూటింగ్ అనుమతులు కోరుతున్న హీరో హీరోయిన్లు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో ఏదైనా షూట్ చేసి దాన్ని ప్రత్యేకంగా పోలీస్ శాఖకు అందజేయాలి. దీని వల్ల జనాలకు త్వరగా సందేశం చేర్చడానికి వీలు పడుతుంది. టికెట్లు అధిక ధరలకు అమ్ముకోవడం బడ్జెట్ రికవరీలో భాగమే అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు మేలు జరగడం కోసం ఇలాంటి నిబంధన పెట్టాల్సి వచ్చిందని సిఎం స్పష్టం చేయడం విశేషం.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అలాంటి వీడియో ఒకటి చేయడం గుర్తు చేసి అభినందించారు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఈ దిశగా కొన్ని యాడ్స్ చేశారు కానీ క్రమం తప్పకుండ ఇవి రావడం లేదు. ఇప్పుడీ కండీషన్ వల్ల థియేటర్లకు పెద్ద ఎత్తున జనాలకు సెలబ్రిటీల ద్వారా చేరాల్సిన సందేశం త్వరగా అందుతుంది. సో టికెట్ రేట్లకు అప్లై చేసే ముందు సామాజిక అవగాహన వీడియో షూట్ చేసుకుని వినతి పత్రంతో పాటు సిడిని అందించేస్తే ఒక పనైపోతుంది. తీసింది ఏ రాష్ట్రం కోసమైనా అది అందరికి ఉపయోగపడేలా చేసుకోవచ్చు.
This post was last modified on July 2, 2024 4:21 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…