పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్లు రేట్ల పెంపు తప్పనిసరైన నేపథ్యంలో నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకోవడం మాములే. ఎన్నికల ముందు వరకు ఏపీలో ఉన్న ఇబ్బంది ప్రభుత్వం మారడం వల్ల తొలగిపోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అంశంలో ప్రొడ్యూసర్లు టెన్షన్ పడాల్సిన పని తప్పిపోయింది. అయితే తెలంగాణ సర్కారు తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజానికి ఉపయోగపడే ఒక మెలిక పెట్టడం అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కించుకుంటోంది. దాని ప్రకారం ఇకపై వెసులుబాట్లు కోరుకునే నిర్మాతలు ఎవరైనా సరే ఒక నియమం పాటించాలి.
అదేంటంటే సమాజంలో ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా వాటి పట్ల అవగాహన కలిగించేలా పెంపులు, షూటింగ్ అనుమతులు కోరుతున్న హీరో హీరోయిన్లు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో ఏదైనా షూట్ చేసి దాన్ని ప్రత్యేకంగా పోలీస్ శాఖకు అందజేయాలి. దీని వల్ల జనాలకు త్వరగా సందేశం చేర్చడానికి వీలు పడుతుంది. టికెట్లు అధిక ధరలకు అమ్ముకోవడం బడ్జెట్ రికవరీలో భాగమే అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు మేలు జరగడం కోసం ఇలాంటి నిబంధన పెట్టాల్సి వచ్చిందని సిఎం స్పష్టం చేయడం విశేషం.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అలాంటి వీడియో ఒకటి చేయడం గుర్తు చేసి అభినందించారు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఈ దిశగా కొన్ని యాడ్స్ చేశారు కానీ క్రమం తప్పకుండ ఇవి రావడం లేదు. ఇప్పుడీ కండీషన్ వల్ల థియేటర్లకు పెద్ద ఎత్తున జనాలకు సెలబ్రిటీల ద్వారా చేరాల్సిన సందేశం త్వరగా అందుతుంది. సో టికెట్ రేట్లకు అప్లై చేసే ముందు సామాజిక అవగాహన వీడియో షూట్ చేసుకుని వినతి పత్రంతో పాటు సిడిని అందించేస్తే ఒక పనైపోతుంది. తీసింది ఏ రాష్ట్రం కోసమైనా అది అందరికి ఉపయోగపడేలా చేసుకోవచ్చు.
This post was last modified on July 2, 2024 4:21 pm
కమర్షియల్ జానర్ జోలికి వెళ్లకుండా కాస్త విభిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటున్న సుహాస్ త్వరలో జనక అయితే కనకతో థియేటర్లలో…
అధికారం చేతిలో ఉంది కాదా అని వైసీపీ నేతలు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భూ…
మాములుగా సంగీత దర్శకులు ఎవరైనా ఒక మహర్దశ అనుభవించాక క్రమంగా నెమ్మదించడం సహజం. చరిత్ర చెప్పేది ఇదే. బ్లాక్ అండ్…
విజయవాడకు చెందిన యువ నాయకుడు.. వంగవీటి రంగా వారసుడు.. రాధా తాజాగా సంచలన వ్యాఖ్య లు చేశారు. అయితే.. ఈవ్యాఖ్యల…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వారు ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని..…
చక్కగా కట్టుకుంటున్న ఇంటిని చిందర వందర చేయడం.. పీకేసి పందిరేయడం.. ఈ రెండింటికీ నిలు వెత్తు ఉదాహరణ ఏపీ రాజధాని…