పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్లు రేట్ల పెంపు తప్పనిసరైన నేపథ్యంలో నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకోవడం మాములే. ఎన్నికల ముందు వరకు ఏపీలో ఉన్న ఇబ్బంది ప్రభుత్వం మారడం వల్ల తొలగిపోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అంశంలో ప్రొడ్యూసర్లు టెన్షన్ పడాల్సిన పని తప్పిపోయింది. అయితే తెలంగాణ సర్కారు తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజానికి ఉపయోగపడే ఒక మెలిక పెట్టడం అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కించుకుంటోంది. దాని ప్రకారం ఇకపై వెసులుబాట్లు కోరుకునే నిర్మాతలు ఎవరైనా సరే ఒక నియమం పాటించాలి.
అదేంటంటే సమాజంలో ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా వాటి పట్ల అవగాహన కలిగించేలా పెంపులు, షూటింగ్ అనుమతులు కోరుతున్న హీరో హీరోయిన్లు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో ఏదైనా షూట్ చేసి దాన్ని ప్రత్యేకంగా పోలీస్ శాఖకు అందజేయాలి. దీని వల్ల జనాలకు త్వరగా సందేశం చేర్చడానికి వీలు పడుతుంది. టికెట్లు అధిక ధరలకు అమ్ముకోవడం బడ్జెట్ రికవరీలో భాగమే అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు మేలు జరగడం కోసం ఇలాంటి నిబంధన పెట్టాల్సి వచ్చిందని సిఎం స్పష్టం చేయడం విశేషం.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అలాంటి వీడియో ఒకటి చేయడం గుర్తు చేసి అభినందించారు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఈ దిశగా కొన్ని యాడ్స్ చేశారు కానీ క్రమం తప్పకుండ ఇవి రావడం లేదు. ఇప్పుడీ కండీషన్ వల్ల థియేటర్లకు పెద్ద ఎత్తున జనాలకు సెలబ్రిటీల ద్వారా చేరాల్సిన సందేశం త్వరగా అందుతుంది. సో టికెట్ రేట్లకు అప్లై చేసే ముందు సామాజిక అవగాహన వీడియో షూట్ చేసుకుని వినతి పత్రంతో పాటు సిడిని అందించేస్తే ఒక పనైపోతుంది. తీసింది ఏ రాష్ట్రం కోసమైనా అది అందరికి ఉపయోగపడేలా చేసుకోవచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…