చియాన్ విక్రమ్ కెరీర్ లోనే అత్యద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాల్లో అపరిచితుడుది ప్రత్యేక స్థానం. తమిళంలో కంటే తెలుగులోనే బ్రహ్మాండంగా ఆడిన ఈ బ్లాక్ బస్టర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందంటే ఇటీవలే రీ రిలీజ్ చేస్తే హైదరాబాద్ క్రాస్ రోడ్స్ థియేటర్లు హౌస్ ఫుల్స్ తో సందడి చేశాయి. దర్శకుడు శంకర్ విక్రమ్ లోని నటనని పూర్తిగా తోడేయడంతో పాటు దేశంలో పెరుగుతున్న అవినీతి పరిష్కారానికి చూపించిన మార్గం జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆచరించేందుకు సాధ్యం కాకపోయినా మూవీలోని థ్రిల్ ని బాగా ఎంజాయ్ చేశారు. ఇక అసలు విషయానికి వద్దాం.
మూడేళ్ళ క్రితం అపరిచితుడుని హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా రీమేక్ చేయాలని శంకర్ ఫిక్సయ్యారు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించారు. అంత పాత సినిమాని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీయడమనే కామెంట్స్ బలంగా వినిపించాయి. పైగా ఒరిజినల్ తాలూకు హిందీ డబ్బింగ్ వెర్షన్ ని జనం అప్పటికే విరగబడి చూశారు. అలాంటప్పుడు ఇంకోసారి వేరే హీరోతో చేయడం అంటే రిస్క్. ఈలోగా ఇండియన్ 2 మొదలు కావడం, గేమ్ ఛేంజర్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల అన్నియన్ రీమేక్ కు బ్రేక్ పడింది. కట్ చేస్తే ఇప్పుడీ ప్రాజెక్టుని పూర్తిగా క్యాన్సిల్ చేసి ఆపేశారు.
ముంబైలో జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో శంకర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. నెక్స్ట్ మరో మూడు కథల మీద వర్క్ చేస్తున్నానని, రణ్వీర్ తో ప్లాన్ చేసుకున్న అన్నియన్ చేయబోవడం లేదని చెప్పేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది శుభవార్త. ఎందుకంటే విక్రమ్ కాకుండా ఆ పాత్రలో ఇంకెవరిని ఊహించుకోలేం. పైగా దర్శకుడు డిమాండ్ చేసిన దానికన్నా రెండింతలు ఎక్కువ యాక్షన్ చేసి చూపించే రణ్వీర్ సింగ్ తో ఇది పెద్ద సాహసం. అయితే వేరే స్టోరీ మీద భవిష్యత్తులో పని చేస్తామని చెబుతున్నారు. ఏదైతేనేం హిందీ అపరిచితుడుని ఆపేసి బ్రతికించారు.
This post was last modified on July 2, 2024 2:55 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…