ప్రభాస్తో నాగ్ అశ్విన్ ఒక అంతర్జాతీయ శ్రేణి సినిమా తలపెట్టిన సంగతి తెలిసిందే. అశ్విన్ ఒక్కసారి కథ చెప్పగానే వెంటనే చేసేస్తున్నా అని మాట ఇచ్చి సినిమా అనౌన్స్ చేసిన ప్రభాస్ ఈ చిత్రం తన పాన్ ఇండియా ఇమేజ్ని మరింత పటిష్టం చేస్తుందని నమ్ముతున్నాడు. నాగ్ అశ్విన్ తన సినిమాను పాన్ ఇండియా సినిమా అంటే ఒప్పుకోవడం లేదు.
ఇది పాన్ వరల్డ్ సినిమా అని, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్లు చూసి మెచ్చుకునేలా వుంటుందని అంటున్నాడు. ఇంతకీ ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందనుందట. అంటే బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ ‘ఆదిత్య 369’ తరహాలో వుంటుందన్నమాట. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ కావడంతో సింగీతం శ్రీనివాసరావుని స్క్రిప్ట్ సలహాదారుగా అశ్విన్ పెట్టుకున్నాడట. నిజానికి సింగీతం ‘ఆదిత్య 999’ అంటూ బాలకృష్ణతో సీక్వెల్ చేద్దామని భావించినా అది కుదర్లేదు.
ఆ సినిమా కోసం పెట్టుకున్న ఐడియాలు అశ్విన్తో షేర్ చేసుకుంటున్నారు కావచ్చు. ప్రపంచ స్థాయి గ్రాఫిక్స్తో ఫ్యూచరిస్టిక్ సినిమా ఎలా వుంటుందో నాగ్ అశ్విన్ ఈ సినిమాతో చూపించబోతున్నాడట. ఇందులో కథానాయికగా దీపిక పడుకోన్ నటించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…