‘కల్కి’ సినిమాలో ఎన్ని పాత్రలున్నాయో లెక్క పెట్టి చెప్పడం కష్టం. అతిథి పాత్రలు చేసిన వాళ్ల లిస్టే చాలా పెద్దది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ.. ఇలా చాలామంది సినిమాలో తళుక్కున మెరిశారు. క్యారెక్టర్ రోల్స్లో కూడా చాలామంది కనిపించారు. ఐతే క్యామియోస్లో కొన్ని వర్కవుట్ అయ్యాయి. క్యారెక్టర్ రోల్స్ చేసిన వాళ్లలో కొందరు తమ ప్రాధాన్యాన్ని చాటుకున్నారు.
ఇక ప్రధాన పాత్రలు చేసిన వాళ్లందరూ కూడా తమదైన ముద్ర వేశారు. కానీ ఇందరి మధ్య రాక్సీ పాత్ర చేసిన బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠాని మాత్రం కనీస స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించలేకపోయింది. ఆమె పాత్ర సినిమాలో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లు వివిధ పాత్రలు, వాటిని పోషించిన నటీనటుల గురించి మాట్లాడుకుంటున్నారు.
కానీ ఎవ్వరూ దిశా పఠాని గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు. సినిమాలో ప్రభాస్ చేసిన భైరవ పాత్రను ఇష్టపడే అమ్మాయి పాత్రలో తను కనిపించింది. కానీ ఆ రొమాన్స్ వర్కవుట్ కాలేదు. ఇద్దరి మధ్య బంధాన్ని తెలిపేలా సన్నివేశాలు రాసుకోలేదు నాగ్ అశ్విన్. ప్రభాస్-దిశా మీద ఒక పాట తీసినా.. అందులో ఆమె గ్లామరస్గా కనిపించినా పెద్దగా ఇంపాక్ట్ లేకపోయింది. ఆ పాట అవ్వగానే దిశ పాత్ర అంతర్ధానం అయిపోతుంది.తర్వాత ఎక్కడా కనిపించదు. అందరూ ఆమెను మరిచిపోతారు.
సినిమా నుంచి బయటికి వచ్చాక దిశగా తలుచుకునేవాళ్లే లేరు. మరోవైపు దీపికా పదుకొనే మాత్రం కీలకమైన పాత్రలో ప్రభాస్ను మించి హైలైట్ కావడం విశేషం. సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరగడం.. తన పెర్ఫామెన్స్ కూడా బాగుండడంతో మంచి అప్లాజ్ వస్తోంది. దిశాకు మాత్రం ఈ సినిమా వల్ల పైసా ప్రయోజనం లేదనే చెప్పాలి.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…