విక్టరీ వెంకటేష్ డెబ్యూ దర్శకులకు చాలా అరుదుగా అవకాశాలు ఇస్తుంటారు. కథ, నెరేషన్ బలంగా ఉంటే తప్ప గ్రీన్ సిగ్నల్ రాదు. అలా అందుకున్న వాళ్లలో జయంత్ సి పరాంజీ ప్రేమించుకుందాం రా, తిరుపతి స్వామి గణేష్ సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తెరంగేట్రం డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక యువ రచయిత వెంకీని మెప్పించాడని ఇన్ సైడ్ టాక్. సామజవరగమనకు రచయితలుగా పని చేసిన వాళ్ళలో నందు ఇటీవలే సురేష్ బాబుతో పాటు వెంకటేష్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని తెలిసింది. స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోందట.
ఇది కార్యరూపం దాలిస్తే మంచిదే. ప్రస్తుతం వెంకటేష్ రానా నాయుడు సీజన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు సమాంతరంగా మూడో భాగం కూడా తీస్తున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. జూలై మొదటి వారం దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలవుతుంది. 2025 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో పక్కా ప్లానింగ్ తో అయిదు నెలల్లో పూర్తి చేయబోతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోయే ఈ మూవీలో ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. లాంచింగ్ రోజున పూర్తి వివరాలు ప్రకటించబోతున్నారు.
దీని తర్వాత ఫైనల్ వెర్షన్ తో కనక మెప్పిస్తే నందు మెగా ఫోన్ చేపట్టవచ్చు. సీరియస్ జానర్ ని ట్రై చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న సైంధవ్ తీవ్రంగా నిరాశపరచడంతో వెంకీ తిరిగి ఎంటర్ టైన్మెంట్ వైపు వచ్చేలా చూసుకుంటున్నారు. నందు చెప్పింది కూడా మల్లీశ్వరి తరహాలో పూర్తి వినోదాత్మకంగా ఉంటుందట. సామజవరగమన మరో రచయిత భాను ఇప్పటికే రవితేజతో సితార ఎంటర్ టైన్మెంట్స్ లో సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని కొలీగ్ నందు ఇలా ఛాన్స్ పట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు. కంటెంట్ ఉండాలే కానీ ట్రాక్ రికార్డు చూడకుండా స్టార్లు ఆఫర్ ఇవ్వడం స్పష్టమవుతోందిగా.
This post was last modified on June 28, 2024 3:14 pm
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…