Movie News

జాతిరత్నాలు దర్శకుడికి ఏమైంది

మూడేళ్ళ క్రితం 2021 జాతిరత్నాలుతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు కెవి అనుదీప్ పేరు మాములుగా మారుమ్రోగలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా ముగ్గురు టాలెంటెడ్ ఆర్టిస్టులతో అతను పండించిన నవ్వులు బాక్సాఫీస్ దగ్గర కోట్లలో కనక వర్షం కురిపించింది. డెబ్యూ మూవీ పిట్టగోడను మర్చిపోయి అందరూ ఇదే అతని తొలి సినిమా అనేంతగా పాపులారిటీ వచ్చింది. తర్వాత తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నుంచి పిలుపు రావడం, ప్రిన్స్ తెరకెక్కించడం జరిగిపోయాయి. అది ఫ్లాప్ కావడం అనుదీప్ మీద గట్టి ప్రభావమే చూపించింది. ఇదంతా జరిగి రెండు సంవత్సరాలు దాటేసింది.

ఈ మధ్య అనుదీప్ నటుడిగా ఎక్కువ కనిపిస్తున్నాడు. మ్యాడ్, కల్కి 2898 ఏడిలో ఆ దర్శకులు స్నేహితులు కావడంతో చిన్న క్యామియోలు చేశాడు. వీటికి ముందు వేరే దర్శకుడితో తన రచనలో ఫస్ట్ డే ఫస్ట్ షో రాసి పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేసుకుంటే అదేమో సూపర్ ఫ్లాప్ అయిపోయి నిరాశ మిగిలించింది. ప్రస్తుతం అనుదీప్ ఏ హీరోకి కమిట్ కాలేదు. ముందు వెంకటేష్ తో ప్రయత్నించాడు. కుదరలేదు. స్టోరీ లైన్ నచ్చినా ఎందుకో ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. తర్వాత రవితేజ సానుకూలంగా విన్నాడు. ఇది సితార సంస్థలో ప్లాన్ చేశారు. అఫీషియల్ లాంచ్ జరగలేదు.

చిరంజీవికి ఒక స్టోరీ రెడీ చేస్తే ఆయనకూ పాయింట్ నచ్చిందట కానీ గ్రీన్ సిగ్నల్ వచ్చే దాకా మెగాస్టార్ మూవీకి గ్యారెంటీ ఉండదు. ఇదంతా ప్రిన్స్ ఫలితం ప్రభావమా అంటే చెప్పలేం. అదేమీ మరీ బాలేని సినిమా కాదు. శివ కార్తికేయన్ ఇమేజ్ కి ఆ జోకులు సూటవ్వక జనం రిసీవ్ చేసుకోలేదు. అంతే. ఆ మాత్రానికి ఇంత గ్యాప్ తీసుకోవడం అనుదీప్ లాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్లకు కరెక్ట్ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు చాలా బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు లాక్ చేసుకున్నారు. మరి జాతిరత్నాలు సృష్టికర్తకు ఎవరితో కాంబినేషన్ కుదురుతుందో వేచి చూడాలి మరి.

This post was last modified on June 28, 2024 3:06 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఇది ప్రభాస్‌కే సాధ్యం

‘బాహుబలి-2’ విడుదలై ఏడేళ్లు దాటిపోయింది. ఈ ఏడేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎన్నో భారీ చిత్రాలు వచ్చాయి. కానీ…

2 mins ago

చంద్రబాబులో జనం కోరుకునేది ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి విజనరీ లీడర్ అనే పేరు కొన్ని దశాబ్దాల కిందటే వచ్చింది. ఆయన ఏం చేసినా,…

3 mins ago

వలంటీర్లకు మంగళమేనా?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉండగా ప్రవేశ పెట్టిన వలంటీర్ల వ్యవస్థ గురించి గత నాలుగేళ్లలో ఎంత చర్చ జరిగిన…

5 mins ago

టాలీవుడ్ అవకాశాలతో కెజిఎఫ్ హీరోయిన్

మాములుగా కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటిస్తే అవకాశాలు క్యూ కట్టాలి. మార్కెట్ పెరగాలి. కానీ హీరోయిన్ శ్రీనిధి…

5 hours ago

జీతం ఇస్తామన్నారు.. తీసుకోలేదు-పవన్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక రూ.4 వేలకు పెంచిన పింఛన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా జులై 1న పంపిణీ చేయడం మొదలుపెట్టింది.…

5 hours ago

1995నాటి బాబును చూస్తారు..బాబుగారి వార్నింగ్

జూలై 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించిన…

7 hours ago