మూడేళ్ళ క్రితం 2021 జాతిరత్నాలుతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు కెవి అనుదీప్ పేరు మాములుగా మారుమ్రోగలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా ముగ్గురు టాలెంటెడ్ ఆర్టిస్టులతో అతను పండించిన నవ్వులు బాక్సాఫీస్ దగ్గర కోట్లలో కనక వర్షం కురిపించింది. డెబ్యూ మూవీ పిట్టగోడను మర్చిపోయి అందరూ ఇదే అతని తొలి సినిమా అనేంతగా పాపులారిటీ వచ్చింది. తర్వాత తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నుంచి పిలుపు రావడం, ప్రిన్స్ తెరకెక్కించడం జరిగిపోయాయి. అది ఫ్లాప్ కావడం అనుదీప్ మీద గట్టి ప్రభావమే చూపించింది. ఇదంతా జరిగి రెండు సంవత్సరాలు దాటేసింది.
ఈ మధ్య అనుదీప్ నటుడిగా ఎక్కువ కనిపిస్తున్నాడు. మ్యాడ్, కల్కి 2898 ఏడిలో ఆ దర్శకులు స్నేహితులు కావడంతో చిన్న క్యామియోలు చేశాడు. వీటికి ముందు వేరే దర్శకుడితో తన రచనలో ఫస్ట్ డే ఫస్ట్ షో రాసి పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేసుకుంటే అదేమో సూపర్ ఫ్లాప్ అయిపోయి నిరాశ మిగిలించింది. ప్రస్తుతం అనుదీప్ ఏ హీరోకి కమిట్ కాలేదు. ముందు వెంకటేష్ తో ప్రయత్నించాడు. కుదరలేదు. స్టోరీ లైన్ నచ్చినా ఎందుకో ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. తర్వాత రవితేజ సానుకూలంగా విన్నాడు. ఇది సితార సంస్థలో ప్లాన్ చేశారు. అఫీషియల్ లాంచ్ జరగలేదు.
చిరంజీవికి ఒక స్టోరీ రెడీ చేస్తే ఆయనకూ పాయింట్ నచ్చిందట కానీ గ్రీన్ సిగ్నల్ వచ్చే దాకా మెగాస్టార్ మూవీకి గ్యారెంటీ ఉండదు. ఇదంతా ప్రిన్స్ ఫలితం ప్రభావమా అంటే చెప్పలేం. అదేమీ మరీ బాలేని సినిమా కాదు. శివ కార్తికేయన్ ఇమేజ్ కి ఆ జోకులు సూటవ్వక జనం రిసీవ్ చేసుకోలేదు. అంతే. ఆ మాత్రానికి ఇంత గ్యాప్ తీసుకోవడం అనుదీప్ లాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్లకు కరెక్ట్ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు చాలా బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు లాక్ చేసుకున్నారు. మరి జాతిరత్నాలు సృష్టికర్తకు ఎవరితో కాంబినేషన్ కుదురుతుందో వేచి చూడాలి మరి.
This post was last modified on June 28, 2024 3:06 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…