Movie News

అయ్యో రకుల్ ప్రీత్

టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి సెటిలైపోయింది. ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. ఆమె బేస్ మాత్రం ముంబయే. గత ఏడాది ఆమె తన లాంగ్ టైం బాయ్‌ఫ్రెండ్ నిర్మాత రాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా బడా నిర్మాతలను పెళ్లాడి సెటిలవడం మామూలే. రకుల్ కూడా తన వరుడిని బాగానే సెట్ చేసుకుందని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి చూసి అయ్యో అనుకుంటున్నారు.

రకుల్ పెళ్లి చేసుకునే సమయానికి రాకీ పరిస్థితి చాలా బాగుంది. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే రాకీ. హిందీలో పూజా ఎంటర్టైన్మెంట్ పదుల సంఖ్యలో పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. కానీ ఆ సంస్థకు గత ఏడాది కాలంలో దారుణమైన దెబ్బలు తగిలాయి.

టైగర్ ష్రాఫ్ హీరోగా తీసిన ‘గణ్‌పథ్’ గత ఏడాది పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ఆ సంస్థ నుంచి వచ్చిన ‘బడేమియా చోటేమియా’ ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ చిత్రంలోనూ టైగర్ ఒక హీరో. మరో హీరో రోల్ అక్షయ్ కుమార్ చేశాడు. ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల దెబ్బకు పూజా ఎంటర్టైన్మెంట్స్ పునాదులు కదిలిపోయాయి. నష్టాల భర్తీకి వశు ఫ్యామిలీ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సంస్థలో 80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చేశారు. పెద్ద బిల్డింగ్ వదిలిపెట్టి చిన్న ఆఫీస్‌కు మారిందీ సంస్థ.

ఈ పరిణామాలన్నీ చూసి రకుల్ గురించి బాధ పడుతున్నారు ఫ్యాన్స్. పెద్ద నిర్మాతను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైందని అనుకుంటే.. ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడిందేంటి అనుకుంటున్నారు. ఈ సమస్యల నుంచి భగ్నానీ కుటుంబం ఎలా బయటపడుతుందో.. రకుల్ ఈ కష్టాన్ని ఎలా తట్టుకుంటుందో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Satya

Recent Posts

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

27 minutes ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

41 minutes ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

47 minutes ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

1 hour ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

1 hour ago

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

2 hours ago