టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లి సెటిలైపోయింది. ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. ఆమె బేస్ మాత్రం ముంబయే. గత ఏడాది ఆమె తన లాంగ్ టైం బాయ్ఫ్రెండ్ నిర్మాత రాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా బడా నిర్మాతలను పెళ్లాడి సెటిలవడం మామూలే. రకుల్ కూడా తన వరుడిని బాగానే సెట్ చేసుకుందని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి చూసి అయ్యో అనుకుంటున్నారు.
రకుల్ పెళ్లి చేసుకునే సమయానికి రాకీ పరిస్థితి చాలా బాగుంది. బాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే రాకీ. హిందీలో పూజా ఎంటర్టైన్మెంట్ పదుల సంఖ్యలో పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. కానీ ఆ సంస్థకు గత ఏడాది కాలంలో దారుణమైన దెబ్బలు తగిలాయి.
టైగర్ ష్రాఫ్ హీరోగా తీసిన ‘గణ్పథ్’ గత ఏడాది పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ఆ సంస్థ నుంచి వచ్చిన ‘బడేమియా చోటేమియా’ ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ చిత్రంలోనూ టైగర్ ఒక హీరో. మరో హీరో రోల్ అక్షయ్ కుమార్ చేశాడు. ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల దెబ్బకు పూజా ఎంటర్టైన్మెంట్స్ పునాదులు కదిలిపోయాయి. నష్టాల భర్తీకి వశు ఫ్యామిలీ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సంస్థలో 80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చేశారు. పెద్ద బిల్డింగ్ వదిలిపెట్టి చిన్న ఆఫీస్కు మారిందీ సంస్థ.
ఈ పరిణామాలన్నీ చూసి రకుల్ గురించి బాధ పడుతున్నారు ఫ్యాన్స్. పెద్ద నిర్మాతను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైందని అనుకుంటే.. ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడిందేంటి అనుకుంటున్నారు. ఈ సమస్యల నుంచి భగ్నానీ కుటుంబం ఎలా బయటపడుతుందో.. రకుల్ ఈ కష్టాన్ని ఎలా తట్టుకుంటుందో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
This post was last modified on June 26, 2024 2:28 pm
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…